పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం
- March 14, 2019
38 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రస్ అల్ ఖైమాలో ఈ రోడు& డప్రమాదం జరిగింది. పొగమంచు ఎక్కువగా వుండడమే రోడ్డు ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఎమిరేట్స్ రోడ్ రౌండెబౌట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రస్ అల్ ఖైమా పోలీస్ సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్, ఉదయం 6.15 నిమిషాల సమయంలో ప్రమాద సమాచారాన్ని అందుకుంది. వెంటనే ట్రాఫిక్ పెట్రోల్స్, అంబులెన్సెస్, సివిల్ డిఫెన్స్, పారామెడిక్స్ అలాగే రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ముందు వెళుతున్న ట్రక్ని పొగమంచు కారణంగా గమనించని వ్యక్తి, తన వాహనంతో ఆ ట్రక్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు లో పరిమిత వేగంతో ప్రయాణించాలని హెచ్చరిస్తున్నా, వాహనదారులు నిబంధనలు పాటించడంలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. కల్నల్ నక్బి మాట్లాడుతూ, వాహనదారులు అప్రమత్తంగా వుంటే చాలావరకు ప్రమాదాల్ని నివారించవచ్చునని చెప్పారు.
తాజా వార్తలు
- ఈనెల 19 నుంచి హార్ముజ్ పూర్తిగా ఓపెన్–ట్రంప్
- 3D మెరైన్ సర్వే ప్రాజెక్ట్ కోసం కొత్త వర్క ఏరియా:కోస్ట్ గార్డ్
- యూఏఈలో మొహర్రం ఆరంభం..!!
- కువైట్ T4 టెర్మినల్ ద్వారా ఆపరేషన్స్ పునఃప్రారంభం..!!
- MENAలో అత్యంత శాంతియుత దేశంగా ఖతార్..!!
- బురైదాలో నలుగురి ప్రాణాలను కాపాడిన సౌదీ బాలుడు..!!
- ఒమన్ లో పిల్లల సోషల్ మీడియా వినియోగం పై అధ్యయనం..!!
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ









