పద్మశ్రీ పురస్కారం అందుకున్నరచయిత సిరివెన్నెల, హీరో మనోజ్..
- March 17, 2019
పద్మ పురస్కారాల ప్రధానోత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రధానం చేశారు. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1984లో కెరీర్ ప్రారంభించిన సిరివెన్నెల వందలాది సినీ గీతాలకు చక్కటి సాహిత్యం అందించారు. ఇప్పటికే ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11 నంది అవార్డులు అందుకున్నారు. నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. తాజాగా రాష్ట్రపతి కోవింద్ సిరివెన్నెలకు పురస్కారం ప్రధానం చేశారు.
జానపద గాయని తీజన్ భాయ్ రామ్నాథ్ చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. పద్మ భూషణ్ అందుకున్నవారిలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్, వాణిజ్యవేత్త ధర్మపాల గులాటీ, పర్వతారోహకురాలు బచేంద్రి పాల్ ఉన్నారు. ఇక పద్మశ్రీ అందుకున్నవారిలో హీరో మనోజ్ బాజ్పాయి, తబలా ఆర్టిస్ట్ సప్నా చౌదరీ, ఫుట్బాల్ ప్లేయర్ సునిల్ ఛత్రి, ఆర్చరీ క్రీడాకారిణి బంబేలా దేవి, పబ్లిక్ అఫైర్స్లో హెచ్ ఎస్ ఫూల్కా, బాస్కెట్బాల్ ప్లేయర్ ప్రశాంతి సింగ్లు ఉన్నారు. ఒడిశాకు చెందిన ఛాయ్వాలా డి. ప్రకాశ్ రావు రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. కటక్కు చెందిన ప్రకాశ్, ఛాయ్ అమ్మగా వచ్చిన డబ్బుతో ఓ స్కూల్ నడుపుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









