పద్మశ్రీ పురస్కారం అందుకున్నరచయిత సిరివెన్నెల, హీరో మనోజ్..
- March 17, 2019
పద్మ పురస్కారాల ప్రధానోత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రధానం చేశారు. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1984లో కెరీర్ ప్రారంభించిన సిరివెన్నెల వందలాది సినీ గీతాలకు చక్కటి సాహిత్యం అందించారు. ఇప్పటికే ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11 నంది అవార్డులు అందుకున్నారు. నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. తాజాగా రాష్ట్రపతి కోవింద్ సిరివెన్నెలకు పురస్కారం ప్రధానం చేశారు.
జానపద గాయని తీజన్ భాయ్ రామ్నాథ్ చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. పద్మ భూషణ్ అందుకున్నవారిలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్, వాణిజ్యవేత్త ధర్మపాల గులాటీ, పర్వతారోహకురాలు బచేంద్రి పాల్ ఉన్నారు. ఇక పద్మశ్రీ అందుకున్నవారిలో హీరో మనోజ్ బాజ్పాయి, తబలా ఆర్టిస్ట్ సప్నా చౌదరీ, ఫుట్బాల్ ప్లేయర్ సునిల్ ఛత్రి, ఆర్చరీ క్రీడాకారిణి బంబేలా దేవి, పబ్లిక్ అఫైర్స్లో హెచ్ ఎస్ ఫూల్కా, బాస్కెట్బాల్ ప్లేయర్ ప్రశాంతి సింగ్లు ఉన్నారు. ఒడిశాకు చెందిన ఛాయ్వాలా డి. ప్రకాశ్ రావు రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. కటక్కు చెందిన ప్రకాశ్, ఛాయ్ అమ్మగా వచ్చిన డబ్బుతో ఓ స్కూల్ నడుపుతున్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







