ఒమన్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ డిజిటలైజేషన్‌ త్వరలో

- March 16, 2019 , by Maagulf
ఒమన్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ డిజిటలైజేషన్‌ త్వరలో

మస్కట్‌: మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి మవసలాత్‌ ట్యాక్సీలలో ప్రయాణించేవారు ఇకపై క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డ్స్‌ ద్వారా చెల్లింపులు చేయడానికి వీలుంది. వచ్చే వారం నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తుంది. నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఒమన్‌ - మవసలాత్‌ మధ్య ఈ మేరకు ఒప్పందం జరిగింది. మవసలాట్‌ ప్రస్తుతం 150 ఎయిర్‌ పోర్ట్‌ ట్యాక్సీలను కలిగి వుంది. ఎన్‌బిఓ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ టెర్మినల్స్‌కి సంబంధించి డ్రైవర్స్‌కి శిక్షణ ఇప్పించడం జరిగింది. ముందు ముందు సుల్తానేట్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ మవసలాట్‌ ట్యాక్సీలకు ఈ విధానాన్ని వర్తింపజేస్తారు.   

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com