విదేశం లో అరుదైన గౌరవం పొందిన టీటీడీ జెఇఓ లక్ష్మి కాంతం

- March 26, 2019 , by Maagulf
విదేశం లో అరుదైన గౌరవం పొందిన టీటీడీ జెఇఓ లక్ష్మి కాంతం

 

గల్ఫ్ దేశం ( యూఏఈ ) అబుదాబి లో (బ్యాప్స్ అద్వర్యం లో నిర్మిస్తున్న దేవాలయం) అంతర్జాతీయంగా నిర్మిస్తున్నహిందూ దేవాలయానికి పునాది పూజ ( ఫౌండేషన్ సెర్మనీ ) కోసం ప్రత్యేక ఆహ్వానం అందింది .. ప్రపంచం నలుమూలలనుండి ఈ కార్యక్రమానికి అతి తక్కువ మంది కి ఆహ్వానం అందింది . అందులో ఆంధ్ర ప్రదేశ్ నుండి టీటీడీ జెఇఓ లక్ష్మి కాంతం కు ఆహ్వానం రావడం ప్రత్యేకమని చెప్పాలి .. లక్ష్మి కాంతం విజయవాడ కలెక్టర్ గా అనేక సంక్షేమ కార్యక్రమాల ఫలాలను పేదలకు అందించడం లో ముందంజలో ఉన్నారు. భారతదేశం నుండి అతి కొద్దిమంది కి ఈ ఆహ్వానం అందింది.

లక్ష్మీకాంతం కి అరుదైన అవకాశం రావడం అభినందనీయం అని యూఏఈ లో ఉన్న కటారి సుదర్శన్, ముక్కు తులసి కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com