అమెరికాపై మండిపోతున్న చైనా
- March 28, 2019
బీజింగ్ : ఐక్య రాజ్య సమితి (ఐరాస)ని అమెరికా బలహీనపరుస్తోందని చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశాన్ని అమెరికా మరింత జటిలం చేస్తోందని దుయ్యబట్టింది.
మసూద్ అజహర్ను 1267 అల్ఖైదా శాంక్షన్స్ కమిటీ జాబితాలో చేర్చాలనే ప్రతిపాదనను చైనా నిలిపివేసిన సంగతి తెలిసిందే. చైనా ఈ చర్యకు పాల్పడినప్పటి నుంచి రెండు వారాల తర్వాత ఫ్రాన్స్, బ్రిటన్ మద్దతుతో అమెరికా ఓ ముసాయిదా తీర్మానాన్ని ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టింది. మసూద్ను ఈ జాబితాలో చేర్చాలని మరోసారి ప్రతిపాదించింది.
ఈ నేపథ్యంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి జెంగ్ షువాంగ్ స్పందించారు. మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న అంశాన్ని అమెరికా మరింత జటిలం చేస్తోందని ఆరోపించారు. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలన్న వైఖరికి అనుగుణంగా అమెరికా వ్యవహరించడం లేదన్నారు. ఈ చర్య ఐరాస భద్రతా మండలి యాంటీ టెర్రరిజం కమిటీ అధికారాలను తగ్గిస్తోందన్నారు. సంఘీభావానికి ఈ వైఖరి దోహదపడబోదని, సమస్యను మరింత జటిలం చేస్తుందని అన్నారు. ఈ ముసాయిదా తీర్మానాన్ని నిర్బంధంగా ప్రవేశపెట్టడానికి బదులు జాగ్రత్తగా వ్యవహరించాలని అమెరికాను కోరుతున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..