ఉత్సాహంగా ఉ.కొరియా వార్షిక మరథాన్‌

- April 07, 2019 , by Maagulf
ఉత్సాహంగా ఉ.కొరియా వార్షిక మరథాన్‌

సియోల్‌: ఉ.కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో ఆదివారం నిర్వహించిన నగర వార్షిక మరథాన్‌లో దాదాపు రెట్టింపు సంఖ్యలో విదేశీ పర్యాటకులు పాల్గొన్నారని నగరంలోని పర్యాటక సంస్థలు వెల్లడించాయి. ఉ.కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌-ఇల్‌-సంగ్‌ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈ మరథాన్‌ను నిర్వహించారు. గత ఏడాది మరథాన్‌లో 450 మంది పర్యాటకులు పాల్గొనగా ఈ ఏడాది పశ్చిమ దేశాలకు చెదిన దాదాపు 950 మందికి పైగా పర్యాటకులు పాల్గొన్నారని పర్యాటక రంగ సంస్థ కొర్యో టూర్స్‌ వెల్లడించింది. అమెరికా బెదిరింపులు, ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ఉ.కొరియాకు పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com