టీవీ చర్చలో యాంకర్పై..
- April 07, 2019
అది టీవీ డిబేట్..లక్షలాది మంది చూస్తారన్న కనీస ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తాడో నాయకుడు. మాటల్లో చూపించిన ఆవేశాన్ని చేతల్లో చూపించాడు. ఓ టీవీ చానెల్లో సీరియస్గా చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు ఒకరు సహనం కోల్పోయారు. అతన్ని..బీజేపీ నేత దేశద్రోహి అనడంతో ఒకసారిగా కోపంతో ఊగిపోయాడు. వెంటనే చేతులకు పని చేప్పాడు. నీళ్ల గ్లాస్ తీసుకుని ప్రత్యర్థిపైకి విసిరేశాడు. దీంతో బీజేపీ నేత మీద ఆ నీళ్ళు కాస్త టీవీ యాంకర్తో పాటు అందరీపై పడ్డాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ ప్రైవేటు టీవీ చానెల్ “భారత ఆర్మీ- ప్రస్తుత ఎన్నికలు” అనే అంశంపై లైవ్ చర్చ నిర్వహించింది. ఈ డిబెట్లో బీజేపీ నుంచి కేకే శర్మ, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి అలోక్ శర్మ, పలువురు విశ్లేఫకులు పాల్గోన్నారు. ఈ చర్చలో అలోక్-శర్మల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అలోక్ శర్మను ఉద్దేశించి బీజేపీ నేత కేకే శర్మ ‘దేశద్రోహి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన అలోక్ శర్మ అసభ్య పదజాలంతో అతనిపైకి ఎదురుగా ఉన్న నీళ్ల గ్లాస్ను విసిరేశారు. ఈ క్రమంలో స్టూడియోలో ఉన్నవారందరిపై నీళ్లు పడ్డాయి. అలోక్ శర్మ ఆవేశాన్ని చూసి యాంకర్తోపాటు మిగతా ప్యానెలిస్టులు బిత్తరపోయారు. అనంతరం ఇద్దరు నేతలను చర్చను బహిష్కరించి యాంకర్ మిగతా చర్చను కొనసాగించారు.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..







