2015లో రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా ఆదాయం ..
- December 30, 2015
2015లో జోరుగా ఆస్తుల క్రయవిక్రయాలు రిజిస్ట్రేషన్శాఖకు భారీగా ఆదాయం తాడికొండ (గుంటూరు), డిసెంబరు 30 రాజధాని ప్రాంతంలో ఈ ఏడాది స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగాయి. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడికొండ, అమరావతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని 29 గ్రామాలను ప్రభుత్వం రాజధానికి ఎంపిక చేసింది. ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 2015లో 30 వేల పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్పరిధిలో దాదాపు 18 వేల రిజిసే్ట్రషన్లు జరగ్గా, తాడికొండ పరిధిలో 8 వేలు, అమరావతి పరిధిలో 6 వేల పైచిలుకు రిజిసే్ట్రషన్లు జరిగినట్లు అధికారిక సమాచారం. ఈ మూడు కార్యాలయాల పరిధిలో ఈ ఏడాది రిజిసే్ట్రషన్ శాఖకు దాదాపు రూ.10 కోట్లపైగా ఆదాయం సమకూరినట్లు అంచనా. రాజధాని 29 గ్రామాల రైతులు భూసమీకరణలో రాజధానికి భూములిచ్చినా.. 40 శాతం మంది రైతులు తిరిగి ఇతరులకు విక్రయించుకున్నట్లు తెలుస్తోంది. సమీకరణలో భూమి ఇచ్చినా.. రైతు భూమిని అమ్ముకునే హక్కును ప్రభుత్వం కల్పించడంతో ఆ విధంగా భూమి చేతులు మారింది. మెట్ట ప్రాంతంలో ఎకరం రూ.1.30 కోట్లు, జరీబులో ఎకరం రూ.2.5 కోట్ల వరకు ధరలు పలికాయి. అయితే రాజధాని గ్రామాల్లో రిజిసే్ట్రషన విలువ ఎకరం రూ.4 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంది. రాజధాని ప్రకటించినా.. ఆయా గ్రామాల్లో భూముల విలువను పెంచలేదు. అయితే రాజధానిలో రైతుల నుంచి తీసుకున్న భూములను అభివృద్ధి చేసి, రైతులకే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో భారీ విలువలతో అనేక మంది భూములను కొనుగోలు చేశారు. జనవరి నుంచి మే వరకు ఊపుగా రిజిసే్ట్రషన్లు జరిగాయి. జూనలో రాజధాని భూమి పూజ జరిగాక, రిజిసే్ట్రషన్లు తగ్గాయి. మళ్లీ అక్టోబర్లో రాజధాని శంకుస్థాపనకు ముందు రిజిసే్ట్రషన్లు జోరుగా సాగాయి. తర్వాత అడపాదడపా జరుగుతున్నా.. ఏడాది మొత్తంలో భూముల క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు ద్వారా రిజిసే్ట్రషనశాఖకు భారీగా ఆదాయం సమకూరింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







