వాహనదారులకు డీలర్లు తప్పనిసరిగా హెల్మెట్ ఇవ్వాలి--జీవీ రాజరత్నం
- December 30, 2015
నూతనంగా ద్విచక్రవాహనం కొనుగోలు చేసిన వాహనదారులకు డీలర్లు తప్పనిసరిగా హెల్మెట్ ఇవ్వాలని డీటీసీ జీవీ రాజరత్నం ఆదేశించారు. గుంటూరులోని పలు షోరూంలలో డీటీసీ బుధవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ఇవ్వకుండా వాహనం విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాహన డీలర్లు వాహనంతో పాటు తప్పనిసరిగా హెల్మెట్ ఇవ్వాల్సిందేనన్నారు. వాహన కొనుగోలుదారులు కూడా హెల్మెట్ను అడిగి తీసుకోవాలన్నారు. డీలర్లు వాహనానికి తాత్కాలిక రిజిస్ర్టేషేన చేసిన వెంటనే కొనుగోలుదారు చేతికి అం దించాలన్నారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా డీలర్ షిప్ రద్దుచేయడం జరుగుతుందన్నారు. నగరంలో ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన రెండు షోరూంలకు నోటీసులు అందించామన్నారు. వాహనం కొన్నారా.. అయితే హెల్మెట్ బిల్లు తీసుకోండి వాహనం కొనుగోలు చేసిన సమయంలో వినియోగదారులు హెల్మెట్ బిల్లును విధిగా అడిగి తీసుకోవాలి. లేకుంటే రిజిసే్ట్రషన సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







