ఐసిస్ ఉగ్రవాదులకు దెబ్బ మీద దెబ్బ..
- December 30, 2015
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ టెర్రర్ దాడి నాయకుడిని అమెరికా దళాలు మట్టుబెట్టాయి. అమెరికా విమాన దాడిలో ప్యారిస్ దాడుల అతను మృతి చెందినట్లు పెంటగాన్ ఓ ప్రకటనలు తెలిపింది. అతను సిరియాలో హతమయ్యాడని తెలిపింది. ఇరాక్ నగరం రమాదీ పైన ఇస్లామిక్ స్టేట్ పట్టు కోల్పోయింది. ఇటీవలే దాని మీద అది పట్టుకోల్పోయింది. రమాదీ పైన తమ పట్టు సడలిపోయిందనే విషయాన్ని ఉగ్రవాద సంస్థ ఐసిస్ జీర్ణించుకునే లోపే ఈ రూపంలో మరో దెబ్బ తగిలింది. పదిమంది ఐసిస్ నాయకులను మట్టుపెట్టినట్లు అమెరికా దళాలు ప్రకటించాయి. మృతి చెందిన వారిలో ప్యారిస్ ఘాతుకానికి ఒడిగట్టిన వారు కూడా ఉన్నారని వెల్లడించాయి. రమాదీలో ఇరాక్ ప్రధాని హైదెర్ అల్ అబాదీ తమ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. తమ సైన్యం రెట్టించిన ఉత్సాహంతో ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గురువారం దేశ వ్యాప్తంగా సెలవు ప్రకటిస్తున్నామని, వేడుకలు నిర్వహిస్తామన్నారు. తమ తదుపరి లక్ష్యం బాగ్ధాద్కు 400 కి.మీ. దూరంలోని మోసుల్ అని చెప్పారు. ఆ నగరాన్ని సైతం ఐసిస్ చెర నుంచి విడిపిస్తామన్నారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







