అతనే నిజమైన హీరో..
- April 08, 2019
కేరళ:సముద్రం ప్రశాంతంగా ఉంది. బీచ్కు వచ్చిన పర్యాటకులు అలలను చూస్తూ వాతావరణాన్ని అస్వాదిస్తున్నారు. ఇంతలో సముద్రంలో నుంచి ఓ వ్యక్తి కేకులు వేస్తూ కాపాడండి అంటూ అరుస్తున్నాడు. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు అతన్ని కాపాడే ప్రయత్నం చేయడం లేదు. భారత నౌకా దళంలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ రాహుల్ దలాల్ తన భార్యతో కలిసి అక్కడే ఉన్నారు. వెంటనే అతను రంగంలోకి దిగారు. ఈత కొట్టుకుంటూ వెళ్లి క్షణాల్లోనే బాధితుడుని చేరుకున్నారు. రాహుల్ అక్కడికి చేరుకునే సరికి బాధితుడు స్పృహ కోల్పోయి ఉన్నాడు. ఓడ్డు చేర్చడానికి రాహుల్ చేస్తున్న ప్రయత్నానికి అతడు సహకరించలేకపోతున్నాడు. రిప్ కరెంట్ అధికంగా ఉండడంతో ఇద్దరినీ సముద్రం లోపలికి లాగేస్తుంది. దాదాపు 30 నిమిషాలు పోరాడి బాధితుణ్ని ఒడ్డుకు తీసుకువచ్చాడు రాహుల్.
- ADVT -
అప్పటికే అతడు పూర్తిగా స్పృహ కోల్పోయాడు. సముద్రం నాచు బాధితుని గోంతులో ఇరుక్కుపోయింది. దీంతో అతనికి ఊపిరి ఆడడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన రాహుల్ దాన్ని బయటకి తీసి ఊపిరి ఉదుతూ, గుండెలపై గట్టిగా ఒత్తాడు. గొంతు ఫ్రీ అయిపోవడంతో అతడు ఊపిరి తీసుకోవడం ప్రారంభించాడు.అంతలోనే అక్కడి చేరుకున్న పోలీసులు భాదితున్ని ఆస్సత్రికి చేర్చి చికిత్స అందించారు. భాధితున్ని ఔరంగాబాద్కు చెందిన దిలీప్ కుమార్గా పోలీసులు గుర్తించారు.
రాహుల్ ధైర్యసాహసాలు అభినందిస్తూ భారత నావికా దళం ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ పోస్టులు పెట్టింది. ఘటన వివరాలను పోస్ట్లో తెలిపింది. అది పెట్టిన కొన్ని గంటల్లోనే ఇన్స్టాగ్రామ్లో 21,000 లైక్లు వచ్చాయి. సోషల్ మీడియా ఈ పోస్ట్ వైరల్గా మారింది. శభాష్ రాహుల్ అంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు .
తాజా వార్తలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!







