మరోసారి ఘోర పరాజయం పాలైన సన్రైజర్స్
- April 09, 2019
సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి ఘోర పరాజయం పాలైంది. ఐపీఎల్లో భాగంగా కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఐఎస్ బృందా స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన ఉత్కంఠ పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. మరో 6 వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటింగ్లో డేవిడ్ వార్నర్ మరోసారి బాధ్యతాయుతమైన ఇన్సింగ్స్ ఆడి 70 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లందరూ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం 151 పరుగుల లక్ష్య చేధన కోసం బరిలోకి దిగిన పంజాబ్ జట్టు మరో బంతి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బ్యాటింగ్లో రాహుల్ ,అగర్వాల్ అదరగొట్టేశారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







