మరోసారి ఘోర పరాజయం పాలైన సన్‌రైజర్స్

- April 09, 2019 , by Maagulf
మరోసారి ఘోర పరాజయం పాలైన సన్‌రైజర్స్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మరోసారి ఘోర పరాజయం పాలైంది. ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌ తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఐఎస్ బృందా స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‎ జట్టుతో జరిగిన ఉత్కంఠ పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. మరో 6 వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‎కు దిగిన సన్‎రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటింగ్‎లో డేవిడ్‌ వార్నర్‌ మరోసారి బాధ్యతాయుతమైన ఇన్సింగ్స్ ఆడి 70 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లందరూ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం 151 పరుగుల లక్ష్య చేధన కోసం బరిలోకి దిగిన పంజాబ్ జట్టు మరో బంతి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బ్యాటింగ్‎లో రాహుల్ ,అగర్వాల్ అదరగొట్టేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com