మరోసారి ఘోర పరాజయం పాలైన సన్రైజర్స్
- April 09, 2019సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి ఘోర పరాజయం పాలైంది. ఐపీఎల్లో భాగంగా కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఐఎస్ బృందా స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన ఉత్కంఠ పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. మరో 6 వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటింగ్లో డేవిడ్ వార్నర్ మరోసారి బాధ్యతాయుతమైన ఇన్సింగ్స్ ఆడి 70 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లందరూ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం 151 పరుగుల లక్ష్య చేధన కోసం బరిలోకి దిగిన పంజాబ్ జట్టు మరో బంతి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బ్యాటింగ్లో రాహుల్ ,అగర్వాల్ అదరగొట్టేశారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?