మరోసారి ఘోర పరాజయం పాలైన సన్రైజర్స్
- April 09, 2019
సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి ఘోర పరాజయం పాలైంది. ఐపీఎల్లో భాగంగా కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఐఎస్ బృందా స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన ఉత్కంఠ పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. మరో 6 వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటింగ్లో డేవిడ్ వార్నర్ మరోసారి బాధ్యతాయుతమైన ఇన్సింగ్స్ ఆడి 70 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లందరూ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం 151 పరుగుల లక్ష్య చేధన కోసం బరిలోకి దిగిన పంజాబ్ జట్టు మరో బంతి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బ్యాటింగ్లో రాహుల్ ,అగర్వాల్ అదరగొట్టేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







