యెమెన్ పై విరుచుకుపడ్డ సౌదీ వాయుసేన
- April 09, 2019
సౌదీ వాయుసేన యెమెన్పై విరుచుకుపడింది. రాజధాని సనాలోని ఓ ప్రయివేట్ పాఠశాలకు సమీపంలోని మెటల్ షాప్పై వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 11 మంది చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో బాలికల సంఖ్య అధికంగా ఉంది. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. మెటల్ షాప్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. కాగా, యెమెన్లోని సైనిక శిబిరాల లక్ష్యంగానే తాము దాడులకు పాల్పడినట్టు సౌదీ పేర్కొంది. చిన్నారులపై దాడులకు పాల్పడలేదని తెలిపింది. గతవారం సేవ్ చిల్డ్రన్ ఛారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకొని సౌదీ వాయుసేన దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. యెమెన్లో చిన్నారుల లక్ష్యంగా సౌదీ వాయుసేన జరిపిన వైమానిక దాడిపై ఐరాస ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..2015 నుంచి సౌదీ సంకీర్ణదళాలు యెమెన్లో జరిపిన దాడుల్లో 10వేల మృతిచెందారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







