సౌదీ చెక్ పాయింట్ వద్ద ఎన్కౌంటర్: ఇద్దరి హతం
- April 09, 2019
సౌదీ:ఖాతిఫ్ గవర్నరేట్ పరిధిలోని ఓ చెక్ పాయింట్ వద్ద సాయుధులైన దుండగులు భద్రతా సిబ్బందిపై దాడికి యత్నించగా, అందులో ఇద్దర్ని హతమార్చిన భద్రతా దళాలు, మరో ఇద్దర్ని సజీవంగా పట్టుకోవడం జరిగింది. ఈస్ట్ ప్రావిన్స్లో ఈ ఘటన జరిగినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. బహ్రెయిన్ అలాగే కువైట్ని కలిపే ఈస్టర్న్ ప్రావిన్స్లోని హైవేపై అబు హద్రియా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈస్టర్న్ ప్రావిన్స్ సెక్యూరిటీ అథారిటీస్ అలాగే ప్రెసిడెన్సీ పర్సనల్ ఓ ఎస్యూవీ ద్వారా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు వెళుతున్నట్లు గుర్తించి వారిని అడ్డగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితులు కాల్పులకు దిగారు. దాంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపారు. నిందితులు వినియోగించిన వాహనం నుంచి పెద్దయెత్తున ఆయుధాల్ని స్వాదీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!







