సౌదీ చెక్ పాయింట్ వద్ద ఎన్కౌంటర్: ఇద్దరి హతం
- April 09, 2019
సౌదీ:ఖాతిఫ్ గవర్నరేట్ పరిధిలోని ఓ చెక్ పాయింట్ వద్ద సాయుధులైన దుండగులు భద్రతా సిబ్బందిపై దాడికి యత్నించగా, అందులో ఇద్దర్ని హతమార్చిన భద్రతా దళాలు, మరో ఇద్దర్ని సజీవంగా పట్టుకోవడం జరిగింది. ఈస్ట్ ప్రావిన్స్లో ఈ ఘటన జరిగినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. బహ్రెయిన్ అలాగే కువైట్ని కలిపే ఈస్టర్న్ ప్రావిన్స్లోని హైవేపై అబు హద్రియా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈస్టర్న్ ప్రావిన్స్ సెక్యూరిటీ అథారిటీస్ అలాగే ప్రెసిడెన్సీ పర్సనల్ ఓ ఎస్యూవీ ద్వారా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు వెళుతున్నట్లు గుర్తించి వారిని అడ్డగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితులు కాల్పులకు దిగారు. దాంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపారు. నిందితులు వినియోగించిన వాహనం నుంచి పెద్దయెత్తున ఆయుధాల్ని స్వాదీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







