యెమెన్ పై విరుచుకుపడ్డ సౌదీ వాయుసేన

- April 09, 2019 , by Maagulf
యెమెన్ పై విరుచుకుపడ్డ సౌదీ వాయుసేన

సౌదీ వాయుసేన యెమెన్‌పై విరుచుకుపడింది. రాజధాని సనాలోని ఓ ప్రయివేట్‌ పాఠశాలకు సమీపంలోని మెటల్‌ షాప్‌పై వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 11 మంది చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో బాలికల సంఖ్య అధికంగా ఉంది. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. మెటల్‌ షాప్‌ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. కాగా, యెమెన్‌లోని సైనిక శిబిరాల లక్ష్యంగానే తాము దాడులకు పాల్పడినట్టు సౌదీ పేర్కొంది. చిన్నారులపై దాడులకు పాల్పడలేదని తెలిపింది. గతవారం సేవ్‌ చిల్డ్రన్‌ ఛారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకొని సౌదీ వాయుసేన దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. యెమెన్‌లో చిన్నారుల లక్ష్యంగా సౌదీ వాయుసేన జరిపిన వైమానిక దాడిపై ఐరాస ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..2015 నుంచి సౌదీ సంకీర్ణదళాలు యెమెన్‌లో జరిపిన దాడుల్లో 10వేల మృతిచెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com