యెమెన్ పై విరుచుకుపడ్డ సౌదీ వాయుసేన
- April 09, 2019సౌదీ వాయుసేన యెమెన్పై విరుచుకుపడింది. రాజధాని సనాలోని ఓ ప్రయివేట్ పాఠశాలకు సమీపంలోని మెటల్ షాప్పై వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 11 మంది చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో బాలికల సంఖ్య అధికంగా ఉంది. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. మెటల్ షాప్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. కాగా, యెమెన్లోని సైనిక శిబిరాల లక్ష్యంగానే తాము దాడులకు పాల్పడినట్టు సౌదీ పేర్కొంది. చిన్నారులపై దాడులకు పాల్పడలేదని తెలిపింది. గతవారం సేవ్ చిల్డ్రన్ ఛారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకొని సౌదీ వాయుసేన దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. యెమెన్లో చిన్నారుల లక్ష్యంగా సౌదీ వాయుసేన జరిపిన వైమానిక దాడిపై ఐరాస ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..2015 నుంచి సౌదీ సంకీర్ణదళాలు యెమెన్లో జరిపిన దాడుల్లో 10వేల మృతిచెందారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ