యెమెన్ పై విరుచుకుపడ్డ సౌదీ వాయుసేన
- April 09, 2019
సౌదీ వాయుసేన యెమెన్పై విరుచుకుపడింది. రాజధాని సనాలోని ఓ ప్రయివేట్ పాఠశాలకు సమీపంలోని మెటల్ షాప్పై వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 11 మంది చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో బాలికల సంఖ్య అధికంగా ఉంది. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. మెటల్ షాప్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. కాగా, యెమెన్లోని సైనిక శిబిరాల లక్ష్యంగానే తాము దాడులకు పాల్పడినట్టు సౌదీ పేర్కొంది. చిన్నారులపై దాడులకు పాల్పడలేదని తెలిపింది. గతవారం సేవ్ చిల్డ్రన్ ఛారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకొని సౌదీ వాయుసేన దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. యెమెన్లో చిన్నారుల లక్ష్యంగా సౌదీ వాయుసేన జరిపిన వైమానిక దాడిపై ఐరాస ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..2015 నుంచి సౌదీ సంకీర్ణదళాలు యెమెన్లో జరిపిన దాడుల్లో 10వేల మృతిచెందారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







