షార్జా లో తెలంగాణ వాసి మృతి..మృతుని కుటుంబాన్ని ఆదుకున్న TRS NRI శాఖ

- April 10, 2019 , by Maagulf
షార్జా లో తెలంగాణ వాసి మృతి..మృతుని కుటుంబాన్ని ఆదుకున్న TRS NRI శాఖ

 

యూఏఈ: షార్జా లో అనారోగ్యం తో మరణించిన రామక్క పేట,దుబ్బాక మండలం ,సిద్దిపేట జిల్లా కు చెందిన పయ్యవుల సత్యనారాయణ  విషయం  దుబాయ్ సంఘ సేవకులు, అన్న గుండెల్లీ నరసింహ ద్వారా తెలుసుకొని సత్యనారాయణ పార్థివ శరీరాన్ని తెలంగాణ కి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించుటకు  TRS NRI ఖతార్ సభ్యులు ముందుకు వచ్చి 20,000 రూపాయల ఆర్ధిక సహాయం  చేయడం జరిగింది.

 ఈ సందర్బంగా TRS ఖతార్ అధ్యక్షుడు  శ్రీధర్ అబ్బగౌని,ఉపాధ్యక్షుడు నర్సయ్య డొనికెని,  అశ్ఫాక్ అహ్మెద్,  మహేందర్ చింతకుంట,శంకరాచారి బొప్పారపు,ప్రేమ్ కుమార్ బొడ్డు, తేజా కుంభాజి, రాజి రెడ్డి సరసం, జాగృతి ఖతార్ నాయకులు శేఖర్ చిలువేరి  ఇతరులు మృతుడు సత్యనారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ చేసారు.

- రాజ్ కుమార్ వనంబత్తిన, మాగల్ఫ్ ప్రతినిధి,​ ఖతార్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com