కోర్టుల కోసం ఎలక్ట్రానిక్‌ పోర్టల్‌ని ఏర్పాటు చేస్తున్న సౌదీ జస్టిస్‌ మినిస్ట్రీ

- April 10, 2019 , by Maagulf
కోర్టుల కోసం ఎలక్ట్రానిక్‌ పోర్టల్‌ని ఏర్పాటు చేస్తున్న సౌదీ జస్టిస్‌ మినిస్ట్రీ

రియాద్‌: మినిస్ట్రీ ఆఫ్‌ జస్టిస్‌ మరియు ఇఎల్‌ఎం ఎంటర్‌రపైజెస్‌, ఎక్స్‌పర్ట్స్‌ ఎలక్ట్రానిక్‌ పోర్టల్‌ ఏర్పాటు విషయమై ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. జ్యుడీషియల్‌ డిపార్ట్‌మెంట్స్‌ని అక్రెడెటెడ్‌ ఎక్స్‌పర్ట్స్‌తో లింక్‌ చేసేలా ఈ పోర్టల్‌ని రూపొందిస్తారు. లిటిగేషన్‌ ప్రాసెస్‌ సమయాన్ని తగ్గించడం, ట్రాన్స్‌పరెన్సీని పెంచడం అలాగే యూనిఫైడ్‌ మరియు అక్రిడెటెడ్‌ రికార్డ్‌ ఎక్స్‌పర్ట్‌ల కోసం రూపొందించడం వంటి ఉద్దేశ్యాలతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. వైస్‌ మినిస్టర్‌ ఆఫ్‌ జస్టిస్‌ ఫర్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వాలిద్‌ బిన్‌ సౌద్‌ అల్‌ రుషౌద్‌ మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్‌ విండో విధానంలో ఇది పనిచేస్తుందని అన్నారు.మినిస్ట్రీ ఆఫ్‌ జస్టిస్‌ తరఫున అల్‌ రషౌద్‌ సంతకం చేశారు. ఇఎల్‌ఎం ఎంటర్‌ప్రైజెస్‌ సీఈఓగా డాక్టర్‌ అబ్దుల్‌ రహ్మాన్‌ బిన్‌ సాద్‌ అల్‌ జాధి ఈ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com