"ఓటర్లు కొత్త రికార్డు క్రియేట్ చేయాలి" అంటూ ట్వీట్ చేసిన మోడీ
- April 11, 2019
ఢిల్లీ: ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు (ఏప్రిల్ 11)న తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్ధేశించి ట్వీట్ చేశారు. ఈ సారి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2019 లోక్సభ ఎన్నికలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలి దశ ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లోని ప్రజలంతా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటింగ్లో సరికొత్త రికార్డు నమోదు కావాలి. ప్రత్యేకించి యువత, ఫస్ట్టైం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నానని ప్రధాని ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







