"ఓటర్లు కొత్త రికార్డు క్రియేట్ చేయాలి" అంటూ ట్వీట్ చేసిన మోడీ

- April 11, 2019 , by Maagulf

ఢిల్లీ: ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు (ఏప్రిల్ 11)న తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్ధేశించి ట్వీట్ చేశారు. ఈ సారి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలి దశ ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లోని ప్రజలంతా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటింగ్‌లో సరికొత్త రికార్డు నమోదు కావాలి. ప్రత్యేకించి యువత, ఫస్ట్‌టైం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నానని ప్రధాని ట్వీట్ చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com