ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..
- April 13, 2019
ఇజ్రాయెల్లో వరుసగా ఐదోసారి ప్రధానిగా ఎన్నికై రికార్డు సృష్టించిన బెంజిమిన్ నెతన్యాహూకు ఇబ్బంది కలిగించే పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే నెతన్యాహూకు షాక్ తగిలింది. చిన్న దేశం… పెద్ద కలలు అంటూ ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూన్ మిషన్ విఫలమైంది.
చంద్రునిపై పరిశోధనకు ఇజ్రాయెల్ ప్రభుత్వం బేరేషీట్ వ్యోమనౌకను పంపించింది. టేకాఫ్ సరిగానే జరిగినప్పటికీ ల్యాండింగ్లో ప్రాబ్లెమ్స్ వచ్చాయి. చివరి దశలో అంతరిక్ష నౌకలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దాంతో చంద్రుని ఉపరితలంపై మరికాసేపట్లో ల్యాండవుతుందనగా కుప్పకూలిపోయింది.
ఇజ్రాయెల్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా బేరెషీట్ స్పేస్క్రాఫ్ట్ను ప్రయోగించింది. బేరెషీట్ అంటే బైబిల్ పదబంధంలో ఆరంభంలో అని అర్థం. ఈ ప్రయోగం కోసం దాదాపు 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. స్పేస్ఐఎల్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ స్పేస్క్రాఫ్ట్ను నిర్మించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా స్పేస్క్రాఫ్ట్ను ప్రయోగించారు. ఇది దాదాపు 7వారాలపాటు అంతరిక్షంలో ప్రయాణించి చంద్రుని సమీపంలోకి చేరింది. గతవారమే చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించింది. కానీ, చంద్రుని ఉపరితలంపై దిగేలోపే కూలి పోయింది.
ఏప్రిల్ 10న చంద్రునికి అతి సమీపంలోని దీర్ఝవృత్తాకార కక్ష్యలోకి బేరేషీట్ స్పేస్క్రాఫ్ట్ ప్రవేశించింది. చంద్రుని ఉప రితలానికి 15-17 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆ వ్యోమనౌకలో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో చంద్రుని ఉప రితలాన్ని ఢీకొట్టి ఒక్కసారిగా కుప్పకూలింది.
బేరేషీట్ స్పేస్క్రాఫ్ట్ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై సురక్షితంగా లాండర్ను దించిన నాలుగో దేశంగా ఇజ్రాయెల్ ఘనత సాధించి ఉండేది. ఇప్పటివరకూ చంద్రునిపై అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సురక్షితంగా లాండర్లను దించగలిగాయి.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







