ఢిల్లీతో ఢీ కొట్టేందుకు చంద్రబాబు సిద్ధం
- April 13, 2019
ఢిల్లీతో ఢీ కొట్టేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. కేంద్రం కక్ష పూరిత చర్యలు, ఈసీ వ్యవహార శైలిపై హస్తిన వేదికగా పోరాటం చేయనున్నారు. ఈ ఉదయం ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు.. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ను కలవనున్నారు. ఎన్నికలు నిర్వహించిన తీరుపై ఈసీని ప్రశ్నించనున్నారు టీడీపీ అధినేత. ఇదే సమయంలో వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీం తీర్పు వ్యవహారంలో రివ్యూ పిటిషన్ వేయనున్నారు.
ఈవీఎంల మొరాయింపు సమయంలో వాటిని సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరు? పోలింగ్ ఆలస్యం కావడానికి కారణం ఏంటి? ఆరు గంటలకు ముగిసే పోలింగ్ అర్థరాత్రి వరకు ఎందుకు సమయం పట్టింది? సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కల్పించకపోవడానికి కారణం ఏంటి? ఓటర్లు ఇబ్బందులు పడ్డ ఎందుకు పట్టించుకోలేదు? కీలక సమయంలో ముఖ్య అధికారులను ఎందుకు బదిలీ చేశారు? అన్న అంశాలపై సీఈసీని ప్రశ్నించనున్నారు చంద్రబాబు.
ఎన్నికల్లో ఈసీ వ్యవహరించిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న చంద్రబాబు.. అటు న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీం తీర్పు వ్యవహారంలో రివ్యూ పిటిషన్ వేయనున్నారు. తీర్పును మరోసారి పున:సమీక్షించి కౌంటింగ్ సమయంలో 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించేలా ఆదేశాలివ్వాలని కోరనున్నారు. వీవీ ప్యాట్ల లెక్కింపుతో ఫలితాలు ఆరు రోజులు ఆలస్యం అని ఈసీ చెప్పడం అబద్ధమని వాదిస్తున్న టీడీపీ అధినేత…ఈ అంశాన్ని కూడా అత్యున్నత న్యాయ స్థానం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
రాష్ట్రం ఎన్నికల నిర్వాహణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. అడిగేవారు లేరని ఈసీ ఇష్టప్రకారం చేసిందని తప్పుపట్టారు. ఈవీఎంల మొరాయింపుతో సీఈఓనే ఓటు వేయలేని పరిస్థితి వచ్చిందన్నారు. రిపేర్ చేస్తామని ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. దాడులు జరుగుతాయని హెచ్చరించినా పట్టించుకోలేదని ఆరోపించారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







