అబుధాబి కుట్ర కేసుకు సంబంధించి హైదరాబాద్ లో ఐసిస్ లింకులు
- April 22, 2019అబుధాబి కుట్ర కేసుకు సంబంధించి హైదరాబాద్ లో ఐసిస్ లింకులు బయటపడుతున్నాయి. ఎన్ఐఏ విస్తృత తనిఖీలు జరిపి ఓ యువతిని అదుపులోకి తీసుకొంది. మహారాష్ట్ర వార్దాకు చెందిన మైమున అనే యువతిని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు తమ అదుపులో ఉన్న వ్యక్తులతో ఆమెకు లింక్ ఉన్నట్లు భావిస్తున్న ఎన్ఐఏ… పలువురు సానుభూతిపరులతో ఆన్లైన్ చాటింగ్ చేసినట్టు ఆధారాలు సేకరించినట్లు సమాచారం.
అబుధాబి కుట్ర కేసుకు సంబంధించి హైదరాబాద్ లో ఐసిస్ లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ విధ్వంసానికి అబుధాబి కేంద్రంగా ఐసిస్ కుట్ర చేస్తోంది. గత ఏడాదే కుట్రను చేధించిన ఎన్ఐఏ..కేసుతో సంబంధం ఉన్నట్లు భావించిన వ్యక్తులపై నిఘా పెట్టింది. ముంబయికి చెందిన మసూద్ తోహాజ్ ను అదుపులోకి తీసుకొని అతనిచ్చిన సమాచారంతో షహీన్నగర్, మైలార్దేవ్పల్లిలోనూ తనిఖీలు చేశారు. షహీన్నగర్కు చెందిన జీషాన్, మైలార్దేవ్పల్లికి చెందిన షిబ్లీ బిలాల్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ కార్యాలయంలో ప్రశ్నించిన అధికారులు..
సాయంత్రం వారిని వదిలిపెట్టారు. ఆదివారం కూడా మరోసారి మసూద్ తోహాజ్, జీషాన్, షిబ్లీ బిలాల్ ను ప్రశ్నించారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…