శ్రీలంక పేలుళ్ళలో దుబాయ్ రెసిడెంట్ మృతి
- April 22, 2019దుబాయ్: శ్రీలంక పేలుళ్ళలో దుబాయ్ రెసిడెంట్ ఒకరు మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 61 ఏళ్ళ రజినా, షాంగ్రి లా హోటల్లో జరిగిన పేలుడులో ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని కసార్గోడ్ నుంచి దుబాయ్కి వచ్చి, ఇక్కడే స్థిరపడ్డారామె. వాస్తవానికి రజినా, శ్రీలంక జాతీయురాలు. పెళ్ళి తర్వాత ఆమె కేరళలో తన భర్త వద్దనే వుండేవారు. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్లోని పలు దేశాల్లో కుటుంబంతో సహా నివసించారు. గత కొన్నాళ్ళుగా ఆమె కుటుంబం దుబాయ్లోనే స్థిరపడింది. రజినా, ఆమె భర్త శ్రీలంకలోని ఆమె సోదరుడు బషీర్ని, ఇతర కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు వెళ్ళారు. అయితే ఇంతలోనే దురదృష్టకర ఘటన జరిగిపోయింది. బాధితురాలి పిల్లలు అమెరికాలో వుంటున్నారని కుటుంబ సభ్యుల్లో ఒకరైన బీరన్ చెప్పారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!