న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ని రద్దు చేసుకున్న శ్రీలంకన్‌ కమ్యూనిటీ

- April 23, 2019 , by Maagulf
న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ని రద్దు చేసుకున్న శ్రీలంకన్‌ కమ్యూనిటీ

మస్కట్‌: శ్రీలంకన్‌ మ్యూనిటీ సోషల్‌ క్లబ్‌, తమ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ని శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ళ కారణంగా రద్దు చేసుకోవడం జరిగింది. టూరిస్టులే లక్ష్యంగా తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడటంతో 290 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. కాగా సింహళ మరియు తమిళ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ని ఏప్రిల్‌ 26న మస్కట్‌ క్లబ్‌ గ్రౌండ్స్‌ - వాడి కబీర్‌ వద్ద నిర్వహించాలనుకున్నారు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామనీ, మృతి చెందినవారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామనీ, ఈ మేరకు మగళవారం సాయంత్రం 8.30 నిమిషాల సమయంలో ఓ కార్యక్రమం చేపడుతున్నామని సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com