కార్న్ దహీ కబాబ్
- May 14, 2015
కావలసిన పదార్ధాలు:
- పెరుగు - ముప్పావు లీటరు
- మొక్కజొన్న గింజలు - 1 కప్పు
- ఉప్పు - తగినంత
- పచ్చిమిర్చి తురుము - 1 టేబుల్ స్పూను
- ఉల్లి ముక్కలు - 1 టేబుల్ స్పూను
- అల్లం తురుము - 2 టేబుల్ స్పూన్లు
- పుదీనా తురుము - 1 1/2 టేబుల్ స్పూను
- జీలకర్ర పొడి - 1/2 టీ స్పూను
- ధనియాల పొడి - 1/2 టీ స్పూను
- మిరియాల పొడి - 1/2 టీ స్పూను
- జీలకర్ర - 1/2 టీ స్పూను
- నెయ్యి - 1/2 కప్పు
చేయు విధానం:
- పెరుగుని పల్చని బట్టలో వేసి నీళ్ళన్నీ పోయేలా చేయాలి.
- మొక్కజొన్న గింజల్ని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి.
- బాణీలో 2 టీ స్పూన్లు నెయ్యి వేసి జీలకర్ర వేయాలి. తరువాత పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, ఉల్లి ముక్కలు, రుబ్బిన మొక్కజొన్న గింజలు వేసి వేయించాలి.
- ఇప్పుడు నీళ్ళు తీసిన పెరుగు వేసి సిమ్ లో నాలుగైదు నిమిషాలు ఉడికించి దించాలి.
- ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి, పుదీనా తురుము, ఉప్పు వేసి కలపాలి.
- ఇప్పుడు మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా తీసుకొని పట్టీల మాదిరిగా చేయాలి.
- పాన్ లో నెయ్యి వేస్తూ వీటిని రెండువైపులా కాల్చి తీయాలి.
--- జి. లీలావతి, విజయవాడ.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







