కార్న్ దహీ కబాబ్
- May 14, 2015
కావలసిన పదార్ధాలు:
- పెరుగు - ముప్పావు లీటరు
- మొక్కజొన్న గింజలు - 1 కప్పు
- ఉప్పు - తగినంత
- పచ్చిమిర్చి తురుము - 1 టేబుల్ స్పూను
- ఉల్లి ముక్కలు - 1 టేబుల్ స్పూను
- అల్లం తురుము - 2 టేబుల్ స్పూన్లు
- పుదీనా తురుము - 1 1/2 టేబుల్ స్పూను
- జీలకర్ర పొడి - 1/2 టీ స్పూను
- ధనియాల పొడి - 1/2 టీ స్పూను
- మిరియాల పొడి - 1/2 టీ స్పూను
- జీలకర్ర - 1/2 టీ స్పూను
- నెయ్యి - 1/2 కప్పు
చేయు విధానం:
- పెరుగుని పల్చని బట్టలో వేసి నీళ్ళన్నీ పోయేలా చేయాలి.
- మొక్కజొన్న గింజల్ని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి.
- బాణీలో 2 టీ స్పూన్లు నెయ్యి వేసి జీలకర్ర వేయాలి. తరువాత పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, ఉల్లి ముక్కలు, రుబ్బిన మొక్కజొన్న గింజలు వేసి వేయించాలి.
- ఇప్పుడు నీళ్ళు తీసిన పెరుగు వేసి సిమ్ లో నాలుగైదు నిమిషాలు ఉడికించి దించాలి.
- ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి, పుదీనా తురుము, ఉప్పు వేసి కలపాలి.
- ఇప్పుడు మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా తీసుకొని పట్టీల మాదిరిగా చేయాలి.
- పాన్ లో నెయ్యి వేస్తూ వీటిని రెండువైపులా కాల్చి తీయాలి.
--- జి. లీలావతి, విజయవాడ.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









