కార్న్ దహీ కబాబ్
- May 14, 2015
కావలసిన పదార్ధాలు:
- పెరుగు - ముప్పావు లీటరు
- మొక్కజొన్న గింజలు - 1 కప్పు
- ఉప్పు - తగినంత
- పచ్చిమిర్చి తురుము - 1 టేబుల్ స్పూను
- ఉల్లి ముక్కలు - 1 టేబుల్ స్పూను
- అల్లం తురుము - 2 టేబుల్ స్పూన్లు
- పుదీనా తురుము - 1 1/2 టేబుల్ స్పూను
- జీలకర్ర పొడి - 1/2 టీ స్పూను
- ధనియాల పొడి - 1/2 టీ స్పూను
- మిరియాల పొడి - 1/2 టీ స్పూను
- జీలకర్ర - 1/2 టీ స్పూను
- నెయ్యి - 1/2 కప్పు
చేయు విధానం:
- పెరుగుని పల్చని బట్టలో వేసి నీళ్ళన్నీ పోయేలా చేయాలి.
- మొక్కజొన్న గింజల్ని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి.
- బాణీలో 2 టీ స్పూన్లు నెయ్యి వేసి జీలకర్ర వేయాలి. తరువాత పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, ఉల్లి ముక్కలు, రుబ్బిన మొక్కజొన్న గింజలు వేసి వేయించాలి.
- ఇప్పుడు నీళ్ళు తీసిన పెరుగు వేసి సిమ్ లో నాలుగైదు నిమిషాలు ఉడికించి దించాలి.
- ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి, పుదీనా తురుము, ఉప్పు వేసి కలపాలి.
- ఇప్పుడు మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా తీసుకొని పట్టీల మాదిరిగా చేయాలి.
- పాన్ లో నెయ్యి వేస్తూ వీటిని రెండువైపులా కాల్చి తీయాలి.
--- జి. లీలావతి, విజయవాడ.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







