తొలిసారి ఆర్మీలో మహిళల రిక్రూట్మెంట్..నోటిఫికేషన్ జారీ
- April 29, 2019
భారత రక్షణ శాఖ చరిత్రలోనే మొదటిసారి మహిళా జవాన్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అమ్మాయిలు ఆన్లైన్ ద్వరా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ జారీ చేసింది. సోల్జర్ జనరల్ డ్యూటీ (విమెన్ మిలటరీ పోలీస్) ఉద్యోగాల కోసం జూన్ 8 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఇండియన్ ఆర్మీ తెలిపింది. అక్టోబర్ 1, 1998 నుంచి ఏప్రిల్ 1, 2002 మధ్య జన్మించిన మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అత్యాచారాలు, దొంగతనాలు తదితర కేసులను మహిళా జవాన్లు విచారిస్తారు.
పొరుగు దేశాలు కాల్పులు జరిపినప్పుడు సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించడం, కార్డన్ సెర్చ్ చేపట్టినప్పుడు మహిళలను తనిఖీ చేయడం లాంటి విధులను వీరు నిర్వర్తిస్తారు. సుమారు 800 మంది మహిళలను తీసుకునే అవకాశం ఉంది. పర్సనల్ బిలో ఆఫీసర్ ర్యాంకులో మహిళలకు కూడా అవకాశం కల్పిస్తామని రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్ జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే సైన్యంలోకి తీసుకున్న మహిళా జవాన్లను సరిహద్దుల్లో పహారాకు పంపడం లాంటి కఠిన బాధ్యతలను మాత్రం అప్పగించరు. సరిహద్దుల్లో మహిళా సైనికుల కోసంసరైన సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..