తొలిసారి ఆర్మీలో మహిళల రిక్రూట్మెంట్..నోటిఫికేషన్ జారీ
- April 29, 2019
భారత రక్షణ శాఖ చరిత్రలోనే మొదటిసారి మహిళా జవాన్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అమ్మాయిలు ఆన్లైన్ ద్వరా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ జారీ చేసింది. సోల్జర్ జనరల్ డ్యూటీ (విమెన్ మిలటరీ పోలీస్) ఉద్యోగాల కోసం జూన్ 8 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఇండియన్ ఆర్మీ తెలిపింది. అక్టోబర్ 1, 1998 నుంచి ఏప్రిల్ 1, 2002 మధ్య జన్మించిన మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అత్యాచారాలు, దొంగతనాలు తదితర కేసులను మహిళా జవాన్లు విచారిస్తారు.
పొరుగు దేశాలు కాల్పులు జరిపినప్పుడు సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించడం, కార్డన్ సెర్చ్ చేపట్టినప్పుడు మహిళలను తనిఖీ చేయడం లాంటి విధులను వీరు నిర్వర్తిస్తారు. సుమారు 800 మంది మహిళలను తీసుకునే అవకాశం ఉంది. పర్సనల్ బిలో ఆఫీసర్ ర్యాంకులో మహిళలకు కూడా అవకాశం కల్పిస్తామని రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్ జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే సైన్యంలోకి తీసుకున్న మహిళా జవాన్లను సరిహద్దుల్లో పహారాకు పంపడం లాంటి కఠిన బాధ్యతలను మాత్రం అప్పగించరు. సరిహద్దుల్లో మహిళా సైనికుల కోసంసరైన సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







