యూ.ఏ.ఈ విష్ణుసహస్రనామం గ్రూప్ ఆధ్వర్యం లో సాముహిక సత్యనారాయణ వ్రతం
- April 30, 2019యూ.ఏ.ఈ లో గల విష్ణుసహస్రనామం గ్రూప్ ఆధ్వర్యం లో గత గురువారం (ఏప్రిల్ 24) నుండి శనివారం(ఏప్రిల్ 26) వరకు సాముహిక సత్యనారాయణ వ్రతం మరియు విష్ణుసహస్రనామ అఖండ పారాయణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భక్తులు 44 గంటల పాటు ఏకధాటిగా 144మార్లు విష్ణుసహస్రనామ స్తోత్ర పఠనం చేసారు. గురువారం ఉదయం సుప్రభాత సేవ తో మొదలైన ఈ కార్యక్రమం, అనంతరం స్వమివారి అభిషేకం, మహానివేదన అనంతరం సామూహిక సత్యనారాయణ వ్రతం, మహాప్రసాదం తదితర కార్యక్రమాలతో కొనసాగింది. శుక్రవారం తిరిగి సుప్రభాత సేవ తో మొదలై కొనసాగిన అఖండ విష్ణుసహస్రనామ పారాయణ శనివారం సాయంత్రం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్య లో హాజరైన భక్తులు స్వామివారి అమూల్యమైన కృపకు పాత్రులయ్యారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!