యూ.ఏ.ఈ విష్ణుసహస్రనామం గ్రూప్ ఆధ్వర్యం లో సాముహిక సత్యనారాయణ వ్రతం
- April 30, 2019
యూ.ఏ.ఈ లో గల విష్ణుసహస్రనామం గ్రూప్ ఆధ్వర్యం లో గత గురువారం (ఏప్రిల్ 24) నుండి శనివారం(ఏప్రిల్ 26) వరకు సాముహిక సత్యనారాయణ వ్రతం మరియు విష్ణుసహస్రనామ అఖండ పారాయణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భక్తులు 44 గంటల పాటు ఏకధాటిగా 144మార్లు విష్ణుసహస్రనామ స్తోత్ర పఠనం చేసారు. గురువారం ఉదయం సుప్రభాత సేవ తో మొదలైన ఈ కార్యక్రమం, అనంతరం స్వమివారి అభిషేకం, మహానివేదన అనంతరం సామూహిక సత్యనారాయణ వ్రతం, మహాప్రసాదం తదితర కార్యక్రమాలతో కొనసాగింది. శుక్రవారం తిరిగి సుప్రభాత సేవ తో మొదలై కొనసాగిన అఖండ విష్ణుసహస్రనామ పారాయణ శనివారం సాయంత్రం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్య లో హాజరైన భక్తులు స్వామివారి అమూల్యమైన కృపకు పాత్రులయ్యారు.

తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







