6.57 మిలియన్‌ పైగా ఉమ్రా వీసాలు జారీ చేసిన సౌదీ అరేబియా

- May 04, 2019 , by Maagulf
6.57 మిలియన్‌ పైగా ఉమ్రా వీసాలు జారీ చేసిన సౌదీ అరేబియా

రియాద్‌: ఈ ఏడాది జారీ చేసిన ఉమ్రా వీసాల సంఖ్య 6,571,991కి చేరుకుందనీ, ఇందులో 5,971,334 మంది యాత్రీకులు కింగ్‌డమ్‌కి చేరుకున్నారని హజ్‌ మినిస్ట్రీ వెల్లడించిన డేటాతో అర్థమవుతోంది. కాగా, 486,876 మంది యాత్రీకులు ఇప్పటికీ కింగ్‌డమ్‌లోనే వున్నారు. 339,970 మంది మక్కాలోనూ, 146,906 మంది మదీనాలోనూ వున్నట్లు సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ పేర్కొంది. అత్యధికంగా 5,339,642 మంది విమాన మార్గంలో వస్తే, 553,536 మంది భూ మార్గంలోనూ, 78,156 మంది సముద్ర మార్గంలో వచ్చారు. పాకిస్తాన్‌ నుంచి అత్యధికంగా 1,353,624 మంది యాత్రీకులు వచ్చారు. ఇండోనేసియా, ఇండియా, ఈజిప్ట్‌, టర్కీ తర్వాతి స్థానాల్లో వున్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com