587 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- May 04, 2019
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ 587 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. ఈ 587 మందిలో వివిధ దేశాలకు చెందినవారున్నారు. పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో ఈ క్షమాభిక్ష ఇవ్వడం జరిగిందని అధికారులు వివరించారు. దుబాయ్ అటార్నీ జనరల్ ఛాన్సెలర్ ఇస్సామ్ ఇస్సా అల్ హుమైదన్ మాట్లాడుతూ, క్షమాభిక్షతో ఆయా వ్యక్తుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందనీ, క్షమాభిక్ష పొందినవారు కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి వుంటుందని ఆకాంక్షించారు. క్షమాభిక్షకు సంబంధించి చట్ట పరమైన చర్యల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇప్పటికే ప్రారంభించిందని ఆయన తెలిపారు. షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ గతంలో 3,005 మంది ఖైదీల విడుదలకు మార్గం సుగమం చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







