587 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- May 04, 2019
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ 587 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. ఈ 587 మందిలో వివిధ దేశాలకు చెందినవారున్నారు. పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో ఈ క్షమాభిక్ష ఇవ్వడం జరిగిందని అధికారులు వివరించారు. దుబాయ్ అటార్నీ జనరల్ ఛాన్సెలర్ ఇస్సామ్ ఇస్సా అల్ హుమైదన్ మాట్లాడుతూ, క్షమాభిక్షతో ఆయా వ్యక్తుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందనీ, క్షమాభిక్ష పొందినవారు కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి వుంటుందని ఆకాంక్షించారు. క్షమాభిక్షకు సంబంధించి చట్ట పరమైన చర్యల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇప్పటికే ప్రారంభించిందని ఆయన తెలిపారు. షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ గతంలో 3,005 మంది ఖైదీల విడుదలకు మార్గం సుగమం చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







