సోషల్ మీడియాను నిషేధించడంపై భిన్నస్వరాలు
- May 06, 2019
శ్రీలంకలో గత నెల 21న చర్చిలు, హోటళ్లు లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు, బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత ప్రభుత్వం సోషల్ మీడియాను నిషేధించడంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. దాడుల తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా నెట్వర్క్లపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు ప్రపంచమంతా క్రమంగా ఈ నినాదం బలపడుతోంది. అయితే ఆంక్షలను ఆన్లైన్ స్వేచ్ఛపై ప్రమాదకర దాడులుగా కొందరు ఆరోపిస్తున్నారు. మరికొందరు సమర్ధిస్తున్నారు.
గతంలోనూ వివిధ దేశాల్లో ఇంటర్నెట్పై, సోషల్ మీడియాపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. చైనా, రష్యా వంటి దేశాల్లో పరిమితంగా అనుమతిస్తున్నారు. ఇంటర్నెట్ అంతా మంచే చేస్తుందనే భావన ప్రమాదకరంగా తయారైందని కొందరంటున్నారు. అంతర్జాతీయ మీడియా సైతం సోషల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిరంకుశ ప్రభుత్వాలపై పోరాటానికి దొరికిన వజ్రాయుధమని అరబ్ ఉద్యమాల సమయంలో సోషల్ మీడియాపై ప్రసంశంలు వెల్లువెత్తాయి. కానీ తర్వాత కాలంలో అదే ప్రమాదకరంగా మారిందన్న భావన బలపడుతోంది. మయన్మార్లో రోహింగ్యాలపై హింసను ప్రేరేపించడానికి, న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో మసీదులో కాల్పులను ఓ దుండగుడు ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఫేస్బుక్ను వాడటంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై నీలినీడలు కమ్ముకున్నాయి.
యూకేలో సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లపై నిషేధం విధించేందుకు సిద్దమైంది. ఇటీవల యూకే పార్లమెంట్ రూపొందించిన కొత్త చట్టం ప్రకారం ఈ నిర్ణయం వెలువడనుంది. సామాజిక మాధ్యమాల వల్ల ఉగ్రవాదం, బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన పోస్టులు ఎక్కువగా చెలామణి అవుతున్నాయి. ఇప్పటికే ఉగ్రవాదం, పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే తొలగించాలని ఆయా సంస్థలను యూకే సర్కారు ఆదేశించింది. 12 వారాల గడువు ఇచ్చింది. అంతే కాదు ఫేక్ న్యూస్, ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం వంటి అంశాలపై సైతం యూకే ప్రభుత్వం సీరియస్గా స్పందించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







