అబుధాబి: 'తెలుగు కళా స్రవంతి' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఉగాది వేడుకలు

- May 06, 2019 , by Maagulf
అబుధాబి: 'తెలుగు కళా స్రవంతి' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఉగాది వేడుకలు

అబుధాబి: తెలుగు కళా స్రవంతి 16వ వార్షికోత్సవం ఉగాది వేడుకలు అబుధాబిలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి 1000 కి పైగా తెలుగు కుటుంబాలు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి సినీ హీరో తనీష్ ముఖ్య అతిధిగా హాజరవ్వగా,మిమిక్రీ ఆర్టిస్ట్ ఇమిటేషన్ రాజు తన మిమిక్రితో ప్రేక్షకులను అలరించారు. మ్యూజిక్ ఇండియా దుబాయ్ టీం వారు పాడిన పాటలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. తెలుగు పిల్లలు చేసిన గ్రూప్ డాన్సులు అన్నిఆకట్టుకునేలా, అద్భుతంగా ప్రదర్శించారు. అబుధాబి ఆడపడుచులు చేసిన నాటితరం తారలు అదనపు ఆకర్షణగా నిలిచింది. మొదటి నుంచి చివరి వరకు అన్ని కార్యక్రమాలు వైవిధ్యముతో ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమాన్నిదిగ్విజయంగా జరుగుటకు సహకరించిన TKS కో-ఆర్డినేటర్స్ డి.యస్.రెడ్డి,రాజశేఖర్, రాజాశ్రీనివాస్, రాము,గోపాల్,గురుప్రసాద్, సత్యనారాయణ, బి.యం రెడ్డి, శరణ్, శేషు, శ్రీధర్, కుమార్,భాస్కర్ కు ప్రెసిడెంట్ పృథ్విరాజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.

మరిన్ని ఫోటోల కొరకు ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యగలరు.

https://photos.app.goo.gl/xReeyJTeMeyjae8Z9

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com