ఇండియా:నేటి నుండి రంజాన్ మాసం ప్రారంభం
- May 07, 2019హైదరాబాద్: ఈరోజు నుండి పవిత్ర రంజాన్ మాసం మొదలైంది. సోమవారం రాత్రి ఏడు గంటలకు ఆకాశంలో నెలవంక కన్పించిందని చార్మినార్ పరిసర మసీదుల నుంచి సైరన్ మోతలు విన్పించాయి. రూహిత్హిలాల్ కమిటీ ప్రతినిధులు సైతం నెలవంక దర్శనమిచ్చిందని సమాచారం అందించారు. దీంతో ముస్లింలు చాంద్ ముబారక్ (చంద్రవంక శుభాకాంక్షలు) తెలుపుకొన్నారు. నేటి నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. మక్కామసీదులో సోమవారం రాత్రి ఎనిమిదిన్నరకు తరావీహ్ నమాజ్ నిర్వహించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల ఏడో తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు ముస్లిం ఉద్యోగులు గంట ముందే ఇంటికి వెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తూఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు సాయంత్రం నాలుగు గంటలకే ఇంటికి వెళ్లవచ్చని సూచించింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్