ప్రముఖ జ్యూవెలరీ సంస్థ ఘరానా మోసం
- May 07, 2019
హైదరాబాద్లో మరో జ్యూవెలరీ షాపు బండారం బయటపడింది. బంగారు ఆభరణాల అమ్మకాలు, ఎగుమతుల్లో శ్రీ కృష్ణా జ్యూవెలర్స్ మోసాలకు పాల్పడుతుందంటూ ఆ సంస్థ ఎండీతో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. విదేశాలకు ఎగుమతి చేసినట్లు దొంగ లెక్కలు చూపించి లోకల్ మార్కెట్లోకి దాదాపు 11 వందల కేజీల బంగారాన్ని తరలించినట్లు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ గుర్తించింది. అలాగే..అభరణాల పేరుతో రత్నాలు, విలువైన రాళ్లను విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్లు డీఆర్ఐ నిర్ధారించుకుంది. బంగారం తూకాన్ని ఎక్కువగా చూపిస్తూ..రత్నాలను తక్కువ లెక్కచెబుతూ వచ్చిన శ్రీకృష్ణ జ్యూవెలర్స్..వాస్తవంలో మాత్రం రత్నాలు, విలువైన రాళ్లను ఎక్కువగా ఎక్స్ పోర్ట్ చేసినట్లు డీఆర్ఐ లెక్క తేల్చింది.
శ్రీకృష్ణ జ్యూవెలర్స్ విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకొని నగల తయారీకి లైసెన్స్ ఉంది. అలాగే ఎగుమతులకు కూడా అనుమతి ఉంది. అయితే..బంగారం ఎగుమతుల పేరుతో వందల కోట్లలో అక్రమాలకు పాల్పడటంపై డీఆర్ఐ ఫోకస్ చేసింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ షోరూంతో పాటు శంషాబాద్ దగ్గర్లోని రావిరాల సెజ్లోని సంస్థ యూనిట్ లో మూడు రోజుల పాటు తనిఖీలు చేపట్టారు అధికారులు. సెజ్ యూనిట్లో 10 కేజీల ఫారెన్ మార్క్ బంగారాన్ని సీజ్ చేశారు. అలాగే బంజారహిల్స్ లోని సంస్థ షోరూంలో 21 కేజీల ఫారెన్ మార్క్ గోల్డ్ ను సీజ్ చేశారు. మొత్తం 14 కోట్ల విలువైన అభరణాలను డీఆర్ఐ జప్తు చేసింది.
ఎగుమతి చేసినట్లు మాయచేసి ఆ బంగారాన్ని దేశీయ మార్కెట్లోకి మళ్లించటంతో పాటు..ఎగుమతి చేసిన అడపాదడపా బంగారం విషయంలో శ్రీకృష్ణ జ్యూవెలర్స్ తప్పుల మీద తప్పులు చేసింది. పన్నులు ఎగ్గొట్టేందుకు మోసాలకు పాల్పడింది. ఎగుమతి అభరణాల్లో విలువైన రత్నాలను పొదిగి..దాన్ని బంగారంగానే లెక్క చూపిస్తు వచ్చింది. అలా లెక్కల్లో జ్యూవెలరీ విలువ తగ్గించి వందల కోట్ల పన్ను ఎగ్గొట్టింది శ్రీకృష్ణ జ్యూవెలరీ.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







