అక్షయ్ కుమార్.. రియల్ హీరో
- May 07, 2019పెను తుపాను బాధితులు ధైర్యంగా ఉండాలని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్ ట్వీట్ చేశాడు. ఫొని దెబ్బకు విలవిల్లాడిన ఒడిశాకు ఆపన్నహస్తం అందించాడు అక్షయ్. ప్రకృతి విధ్వంసంలో దారుణంగా దెబ్బతిన్న రాష్ట్రానికి కోటి తుపాను సాయం ప్రకటిస్తూ, మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాడు. ప్రకృతి విపత్తులు సంభవించినపుడు ఆయా ప్రాంతాలకు తనవంతు సాయం అందించటం అక్షయ్కు కొత్త కాదు. కేరళ, చెన్నై ప్రాంతాల్లోనూ ఇటీవల తుపాన్లు భీభత్సం సృష్టించినపుడు -అక్షయ్ తనవంతు సాయాన్ని ప్రకటించాడు. '్భరత్ కే వీర్' వెబ్సైట్ ద్వారా జవానుల కుటుంబాలను ఆదుకోవడం నాకు సంతృప్తినిచ్చే విషయమని పదేపదే చెప్పే అక్షయ్కుమార్, ఇటీవలి కాలంలో దేశభక్తి చిత్రాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడమూ తెలిసిందే. పెను తుపానుగా విరుచుకుపడిన ఫొని, ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం తెలిసిందే.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం