అక్షయ్ కుమార్.. రియల్ హీరో
- May 07, 2019
పెను తుపాను బాధితులు ధైర్యంగా ఉండాలని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్ ట్వీట్ చేశాడు. ఫొని దెబ్బకు విలవిల్లాడిన ఒడిశాకు ఆపన్నహస్తం అందించాడు అక్షయ్. ప్రకృతి విధ్వంసంలో దారుణంగా దెబ్బతిన్న రాష్ట్రానికి కోటి తుపాను సాయం ప్రకటిస్తూ, మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాడు. ప్రకృతి విపత్తులు సంభవించినపుడు ఆయా ప్రాంతాలకు తనవంతు సాయం అందించటం అక్షయ్కు కొత్త కాదు. కేరళ, చెన్నై ప్రాంతాల్లోనూ ఇటీవల తుపాన్లు భీభత్సం సృష్టించినపుడు -అక్షయ్ తనవంతు సాయాన్ని ప్రకటించాడు. '్భరత్ కే వీర్' వెబ్సైట్ ద్వారా జవానుల కుటుంబాలను ఆదుకోవడం నాకు సంతృప్తినిచ్చే విషయమని పదేపదే చెప్పే అక్షయ్కుమార్, ఇటీవలి కాలంలో దేశభక్తి చిత్రాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడమూ తెలిసిందే. పెను తుపానుగా విరుచుకుపడిన ఫొని, ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం తెలిసిందే.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







