ఖతార్కు బి-52 బాంబర్లను తరలించిన అమెరికా
- May 11, 2019
వాషింగ్టన్:ఇరాన్తో యుద్ధ మేఘాలు అలుముకుంటున్న నేపథ్యంలో అమెరికా వాయుసేన ఖతార్లోని తమ వైమానిక స్థావరానికి బి-52 తరహా బాంబర్ యుద్ధ విమానాలను తరలించింది. ఇరాన్ నుండి ఎటువంటి అనూహ్యమైన ముప్పు ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ విమానాలను తరలిస్తున్నట్లు వాయుసేన ఒక ప్రకటనలో వివరించింది. ఈ మేరకు తమ వద్దకు బి-52 బాంబర్ యుద్ధ విమానాలు గురువారం రాత్రి చేరుకున్నట్లు కతార్లోని అమెరికా వాయుసేన అధికారులు చెప్పారు. ఈ విమానాలు లూసియానాలోని 20వ బాంబ్ స్క్వాడ్రన్ నుండి వచ్చాయని, ఇతర బి-52లు ఆగేయాసియాలోని ఒక ప్రాంతానికి చేరుకున్నాయని వాయుసేన తన ప్రకటనలో వివరించింది. అంతకు ముందు లూసియానా నుండి టేకాఫ్ తీసుకుంటున్న బి-52 బాంబర్లతో కూడిన వీడియోను అమెరికన్ వాయుసేన విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







