ఖతార్‌కు బి-52 బాంబర్లను తరలించిన అమెరికా

- May 11, 2019 , by Maagulf
ఖతార్‌కు బి-52 బాంబర్లను తరలించిన అమెరికా

వాషింగ్టన్‌:ఇరాన్‌తో యుద్ధ మేఘాలు అలుముకుంటున్న నేపథ్యంలో అమెరికా వాయుసేన ఖతార్‌లోని తమ వైమానిక స్థావరానికి బి-52 తరహా బాంబర్‌ యుద్ధ విమానాలను తరలించింది. ఇరాన్‌ నుండి ఎటువంటి అనూహ్యమైన ముప్పు ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ విమానాలను తరలిస్తున్నట్లు వాయుసేన ఒక ప్రకటనలో వివరించింది. ఈ మేరకు తమ వద్దకు బి-52 బాంబర్‌ యుద్ధ విమానాలు గురువారం రాత్రి చేరుకున్నట్లు కతార్‌లోని అమెరికా వాయుసేన అధికారులు చెప్పారు. ఈ విమానాలు లూసియానాలోని 20వ బాంబ్‌ స్క్వాడ్రన్‌ నుండి వచ్చాయని, ఇతర బి-52లు ఆగేయాసియాలోని ఒక ప్రాంతానికి చేరుకున్నాయని వాయుసేన తన ప్రకటనలో వివరించింది. అంతకు ముందు లూసియానా నుండి టేకాఫ్‌ తీసుకుంటున్న బి-52 బాంబర్లతో కూడిన వీడియోను అమెరికన్‌ వాయుసేన విడుదల చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com