ఖతార్కు బి-52 బాంబర్లను తరలించిన అమెరికా
- May 11, 2019
వాషింగ్టన్:ఇరాన్తో యుద్ధ మేఘాలు అలుముకుంటున్న నేపథ్యంలో అమెరికా వాయుసేన ఖతార్లోని తమ వైమానిక స్థావరానికి బి-52 తరహా బాంబర్ యుద్ధ విమానాలను తరలించింది. ఇరాన్ నుండి ఎటువంటి అనూహ్యమైన ముప్పు ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ విమానాలను తరలిస్తున్నట్లు వాయుసేన ఒక ప్రకటనలో వివరించింది. ఈ మేరకు తమ వద్దకు బి-52 బాంబర్ యుద్ధ విమానాలు గురువారం రాత్రి చేరుకున్నట్లు కతార్లోని అమెరికా వాయుసేన అధికారులు చెప్పారు. ఈ విమానాలు లూసియానాలోని 20వ బాంబ్ స్క్వాడ్రన్ నుండి వచ్చాయని, ఇతర బి-52లు ఆగేయాసియాలోని ఒక ప్రాంతానికి చేరుకున్నాయని వాయుసేన తన ప్రకటనలో వివరించింది. అంతకు ముందు లూసియానా నుండి టేకాఫ్ తీసుకుంటున్న బి-52 బాంబర్లతో కూడిన వీడియోను అమెరికన్ వాయుసేన విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







