రాజ్కందుకూరి తనయుడు హీరోగా సినిమా షూటింగ్ ప్రారంభం
- May 11, 2019ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎంతో మంది హీరోల తనయులు వారసులుగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్ లోకి మరో వారసుడు హీరోగా వస్తున్నాడు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి పెళ్ళి చూపులు చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు.
చాలా మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా రాజ్కందుకూరికి మంచి పేరుంది. ఆయన తన తనయుడు శివ కందుకూరిని హీరోగా తెలుగు తెరకి పరిచయం చేస్తున్నారు. భరత్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, గతంలో కాజల్ కి మేనేజర్ గా పనిచేసిన 'రాన్సన్' నిర్మిస్తున్నారు. మేఘా ఆకాశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను లాంచ్ చేశారు.
ఈ చిత్రానికి కాజల్ క్లాప్ ఇవ్వగా .. సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా .. 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి 'మనుచరిత్ర' అనే టైటిల్ ను ఖరారు చేశారు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. కాజల్ సమర్పకురాలిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను, ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
తాజా వార్తలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!