రాజ్కందుకూరి తనయుడు హీరోగా సినిమా షూటింగ్ ప్రారంభం
- May 11, 2019
ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎంతో మంది హీరోల తనయులు వారసులుగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్ లోకి మరో వారసుడు హీరోగా వస్తున్నాడు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి పెళ్ళి చూపులు చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు.
చాలా మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా రాజ్కందుకూరికి మంచి పేరుంది. ఆయన తన తనయుడు శివ కందుకూరిని హీరోగా తెలుగు తెరకి పరిచయం చేస్తున్నారు. భరత్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, గతంలో కాజల్ కి మేనేజర్ గా పనిచేసిన 'రాన్సన్' నిర్మిస్తున్నారు. మేఘా ఆకాశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను లాంచ్ చేశారు.
ఈ చిత్రానికి కాజల్ క్లాప్ ఇవ్వగా .. సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా .. 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి 'మనుచరిత్ర' అనే టైటిల్ ను ఖరారు చేశారు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. కాజల్ సమర్పకురాలిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను, ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







