ఉగ్రవాదంపై చర్యలు..
- May 12, 2019
ఉగ్రవాదంపై భారత్ సహా వివిధ దేశాలు ముప్పేట దాడి చేస్తుడంతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. తప్పనిసరిగా ఉగ్రవాదంపై చర్యలు చేపడ్తోంది. మొన్న మసూద్ అజర్ ఆస్తులను స్తంభింప చేసిన ఇమ్రాన్ సర్కారు.. తాజాగా జైషే మహ్మద్ సంస్థ సహా మొత్తం 12 అతివాద సంస్థలను నిషేధించింది. ఉగ్రవాదులకు అడ్డాగా మారి భారత్కు పక్కలో బల్లెంగా తయారైన దయాది పాకిస్థాన్.. ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గింది. ఉగ్రవాదంపై పొరుగుదేశాలను సంతృప్తి పరిచే చర్యలకు శ్రీకారం చుట్టింది. గతకొంతకాలంగా భారత్ కు తలనొప్పిగా మారిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థపై తాజాగా నిషేధం విధించింది. జైషే సంస్థ సహా మొత్తం 12 అతివాద సంస్థలపై నిషేధిత జాబితాలో చేర్చారు. నేషనల్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఇమ్రాన్ సర్కారు తెలిపింది.
ఉగ్రవాద సంస్థల అధినేతలు హఫీజ్ సయిద్, మసూద్ అజార్తో పాటు ఉగ్రవాద గ్రూప్లతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 సంస్థలను నిషేధిత జాబితాలో చేర్చినట్లు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. లాహోర్ లోని అల్ అన్ఫల్ ట్రస్ట్, ఇదరే ఖద్మత్ ఖలాక్, అల్ దావత్ ఉల్ ఇర్షాద్, మాస్క్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్, మువాజ్ బిన్ జబల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, అల్ మదీనా ఫౌండేషన్, అల్ ఈసర్ ఫౌండేషన్ లతో పాటు ఫైసలాబాద్లోని అల్ హమద్ ట్రస్ట్, భావల్పూర్ లోని అల్ రహమత్ ఆర్గనైజేషన్, కరాచీలోని అల్ ఫర్ఖాన్ ట్రస్ట్ లు నిషేధించిన జాబితాలో ఉన్నాయి.
మరోవైపు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంతో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తన పేరు మార్చుకుంది. ఇప్పుడా సంస్థ పేరు జైషే ముత్తాఖీ! అయితే పాకిస్థాన్ నిషేధించిన ఉగ్రవాద సంస్థల్లో జైషే మహ్మద్ ఉంది కానీ, జైషే ముత్తాఖీ లేకపోవడం ఉగ్రవాదంపై ఇమ్రాన్ ఖాన్ సర్కారు డొల్లతనాన్ని తెలుపుతోంది.
తాజా వార్తలు
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!