కేదార్నాథ్ లో మోదీ
- May 19, 2019
ప్రధాని మోదీ ఆధ్యాత్మిక బాట పట్టారు. ఇన్నాళ్లు ఎన్నికల కురుక్షేత్రంలో బిజీబిజీగా ఉన్న ఆయన.. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ను సందర్శిం చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నేరుగా కేదార్నాధ్ చేరుకున్న మోదీకి ఆలయ పూజారులు సంప్రదాయపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయం దగ్గరకు వెళ్లిన మోదీ, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత గర్భగుడిలోకి వెళ్లి కేదారనాధునికి ప్రత్యేక పూజలు చేశారు.
గర్భగుడిలో దాదాపు అరగంట పాటు మోదీ పూజలు చేశారు. బోలేనాథునికి మోదీ రుద్రాభిషేకం, అర్చన నిర్వహించారు. పూజాదికాల అనంతరం ఆలయం బయటకు వచ్చిన మోదీ, అక్కడ ఉన్న నందీశ్వరునికి కూడా పూజలు చేశారు. ఆలయ అర్చకలు మోదీకి ఓ కట్టె, శాలువాను బహుకరించారు.
బోలేనాథుని దర్శనంలో మోదీ వస్త్రధారణ స్థానికులను థ్రిల్కు గురి చేసింది. నేపాలీ లుక్లో నీలిరంగు చోలా డ్రెస్సులో మోదీ కేదారనాథున్ని దర్శించు కున్నారు. హిమాచల్ప్రదేశ్ ప్రజలు ధరించే టోపీ పెట్టుకున్నారు. నడుముకు ఎర్రటి కండువా కట్టుకున్నారు. మెడలో భారీ శాలువా వేసుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ వస్త్రధారణలోనే మహాశివునికి పూజాదికాలు నిర్వహించారు.
ఆలయ సందర్శన, ప్రత్యేక పూజల తర్వాత మోదీ ఆలయానికి సమీపంలో ఉన్న పవిత్ర గుహకు వెళ్లారు. అక్కడ కాసేపు ధ్యానం చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ కేదార్నాథ్ వెళ్లడం ఇది నాలుగోసారి. మోదీ నిన్న రాత్రి అక్కడే బస చేశారు. ఇవాళ బద్రీనాధ్కు వెళ్లిప్రత్యేక పూజలు చేసి, స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు.
తాజా వార్తలు
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్









