బ్రెజిల్:బార్లో కాల్పులు 11 మంది మృతి
- May 20, 2019
బెలెమ్: బ్రెజిల్లోని పారా రాష్ట్రం కాల్పుల మోతతో దద్దరిల్లింది. బెలెమ్ నగరంలోని ఓ బార్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకరాం..కార్లు, బైక్లపై వచ్చిన ఏడుగురు సాయుధ దుండగులు బార్లోకి ప్రవేశించి అక్కడి వారిపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఘటన అనంతరం దుండగులు పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించారు. ఓ నిందితుడిని పట్టుకోగా.. మిగిలినవారు పరారయ్యారు. కాల్పుల్లో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడి వెనుక కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.
తాజా వార్తలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు









