తమిళ రీమేక్ తో హీరో రామ్ కొత్త సినిమా!
- May 20, 2019
రామ్ పోతినేని కి సరైన హిట్ లేక బాధ పడుతున్నాడు. "నేను శైలజ" అనే సినిమా తరువాత చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటీ లేదు. తరువాత వచ్చిన "ఉన్నది ఒక్కటే జిందగీ" సినిమా కు మంచి ఆధరణ లభించినా, సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో రామ్ చాతికెల పడిపోయాడు. హిట్ కోసం చాల ఆశగా ఏడురుచుస్తున్నాడు ఈ హీరో.
"దేవదాసు" సినిమా తో రామ్ పోతినేని కి మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది. తన సరసన చేసిన ఇలయానా కి కుడా దేవదాసు సినిమా తరువాత పెద్ద స్టార్ రేంజ్ కి వెళ్ళిపోయింది. దేవదాసు తరువాత రామ్ చాల సినిమాలు చేసాడు కొన్ని పెద్ద హిట్స్ , మరి కొన్ని యావరేజ్ అయ్యాయి. అయితే ఒకేసారి "నేను శైలజ" సినిమా తరువాత గ్యాప్ రావడంతో ఒక్కసారి గా రామ్ వెనకపడిపోయాడు.
రామ్ లేటెస్ట్ గా "ఇస్మార్ట్ శంకర్" అనే సినిమా తో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా వరుస పరాజయాలతో భాధడుతున్న మన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వం లో రాబోతుంది. ఈ సినిమా ను పూరి తన సొంత బ్యాన్నేర్ అయిన "పూరి కనెక్ట్ " పై చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కు ప్రముఖ హీరోయిన్ ఛార్మి కూడా పెట్టుబడి పెట్టినట్లు సమాచరం.
తాజాగా ఈ సినిమా మేకర్స్ "ఇస్మార్ట్ శంకర్" టిజర్ ను రిలీజ్ చేసారు. ఈ టిజర్ ప్రేక్షకులను బాగా అలరించింది. టిజర్ లో మంచి మాస్ లుక్ లో కనిపించాడు రామ్. దీంతో ప్రేక్షకులకు ఈ సినిమా పై భారి అంచనాలే ఉన్నాయి. అయితే తాజాగా రామ్ ఇంకో కొత్త సినిమా కు సంతకం చేసాడట. ఈ సినిమా కిశోరే తిరుమల దర్శకత్వం లో రాబోతుంది. ఈ డైరెక్టర్ రామ్ తో "నేను శైలజ" ఉన్నది ఒక్కటే జిందగీ" సినిమాలు తీసాడు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







