విజయవాడ లో మహర్షి విజయోత్సవం
- May 20, 2019
మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా విజయోత్సవం విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు కె రాఘ వేంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిత్ర బృందమంతా పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ.మహేష్ విజయాలు చూసి కృష్ణ గారు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. మహేష్ను తెరకు పరిచయం చేసి నందుకు నేనూ ఎంతో గర్విస్తున్నాను. ఈ చిత్రంలో రిషిగా మహేష్ ప్రయా ణం బాగుంది. రైతు బాగుండాలని చెప్పే అంశం ఆకట్టుకుంది. మే 9ని మహర్షి డేగా ప్రకటించాలి. అన్నారు. మహేష్ బాబు మాట్లా డుతూ.నేను స్టార్ హీరో అవుతానని తొలి చిత్రం అప్పు డే రాఘవేంద్రరావు గారు చెప్పారు. మంచి సినిమాతో నాకు కెరీర్ను ఇచ్చారాయాన. మహర్షి సినిమా చిత్రీకరణ ప్రారంభించినప్పుడే ఇది మరో పోకిరి అవుతుందని ఆశించాను. మంచి సినిమా చేస్తే అభిమానులు ఎంత సహకరిస్తారో నాకు తెలుసు. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. అని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







