పీఎంఎస్బీవై ఇన్సూరెన్స్ స్కీం..
- May 20, 2019
ఏ ప్రమాదమూ తెలిసి జరగదు. అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు అక్కరకొస్తాయి ఇన్సూరెన్స్ పాలసీలు. అందుకే జీవిత బీమా, ఆరోగ్య బీమాతో పాటు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలజీ తీసుకుంటే ఉత్తమం. ప్రభుత్వం కూడా సామాజిక భద్రత నేపథ్యంలో పలు స్కీములు అందిస్తోంది. వీటిల్లో ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బావై) ఒకటి. ప్రమాదవశాత్తు మరణం లేదా అంగవైకల్యం సంభవిస్తే ఈ పాలసీ కొంత ఆర్థిక ధైర్యాన్ని ఇస్తుంది.
పీఎంఎస్బావై యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ పాలసీ వ్యవధి సంవత్సరము. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. 18 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. స్కీమ్లో జాయిన్ అయ్యే ముందే ఆటో డెబిట్ ఫెసిలిటీ ఏర్పాటు అంగీకారం తెలపాలి. అంటే మీ అకౌంట్ నుంచి పాలసీ ప్రీమియం ప్రతి ఏడాది ఆటోమేటిక్గా కట్ అవుతుంది. పాలసీ ప్రీమియం ఏడాదికి రూ.12. మే 25 నుంచి 31 మధ్య కాలంలో పాలసీ ప్రీమియం మీ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు పాలసీ కవర్ వర్తిస్తుంది. ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా రూ.2 లక్షలు లభిస్తాయి. అదే పాక్షిక అంగవైకల్యానికి అయితే రూ.1 లక్ష వస్తుంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







