రాళ్ళపల్లికి కన్నీటి వీడ్కోలు
- May 20, 2019
సినీ హాస్యనటుడు రాళ్ళపల్లి వెంకట నరసింహారావుకు ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆశ్రునయనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంత్యక్రియలు రాయదుర్గం మహాప్రస్థానంలో సోమవారం ఉదయం నిర్వహించారు. మొదట తన నివాసం నుంచి ప్రారంభమైన ఆయన అంతిమ యాత్ర రాయదుర్గం మహాప్రస్థానానికి చేరుకుంది. అనంతరం ఆయన పార్థివ దేహాన్ని స్మశాన వాటికకు తీసుకొని వచ్చి విద్యుత్ దహన వాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేపట్టారు. అంతిమ యాత్రలో సినీ ప్రముఖులు రాజశేఖర్, జీవిత దంపతులు, కోట శ్రీనివాసరావు, భరద్వాజ, తనికెళ్ళభరణి, బాబూమోహన్, శివాజీరాజాతో పాటు ఆయన అభిమానులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- చైనా ప్రీమియర్ లీ చియాంగ్తో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ కీలక భేటీ
- ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం!
- రాజస్థాన్ పై హైదరాబాద్ విజయం
- గమ్యస్థానానికి సురక్షితంగా చేరుదాం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
- బెట్టింగ్లు, జూదం పై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!









