రాళ్ళపల్లికి కన్నీటి వీడ్కోలు
- May 20, 2019సినీ హాస్యనటుడు రాళ్ళపల్లి వెంకట నరసింహారావుకు ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆశ్రునయనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంత్యక్రియలు రాయదుర్గం మహాప్రస్థానంలో సోమవారం ఉదయం నిర్వహించారు. మొదట తన నివాసం నుంచి ప్రారంభమైన ఆయన అంతిమ యాత్ర రాయదుర్గం మహాప్రస్థానానికి చేరుకుంది. అనంతరం ఆయన పార్థివ దేహాన్ని స్మశాన వాటికకు తీసుకొని వచ్చి విద్యుత్ దహన వాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేపట్టారు. అంతిమ యాత్రలో సినీ ప్రముఖులు రాజశేఖర్, జీవిత దంపతులు, కోట శ్రీనివాసరావు, భరద్వాజ, తనికెళ్ళభరణి, బాబూమోహన్, శివాజీరాజాతో పాటు ఆయన అభిమానులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!