టాలీవుడ్ సీనియర్ లిరిసిస్ట్ చంద్రబోస్ ఇంట్లో విషాదం
- May 20, 2019తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోస్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి మదనమ్మ సోమవారం కన్నుమూశారు. గుండెపోటు కారణంగా మదనమ్మ తుదిస్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె అంత్య క్రియలు స్వగ్రామమైన చల్లగిరిలో జరుగనున్నాయి.
చంద్రబోస్ స్వగ్రామం వరంగల్ జిల్లా చిట్యాల మండల చల్లగిరి గ్రామం. నర్సయ్య, మదనమ్మ దంపతుల నలుగురు సంతానంలో చంద్రబోస్ అందరికంటే చిన్నవాడు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా, తల్లి గృహిణి. వారి మూలంగా చిన్నతనంలోనే చంద్రబాబోస్లో సాహిత్యబీజం పడింది.
గతంలో ఓ సందర్భంలో చంద్రబోస్ మాట్లాడుతూ.. చిన్నతనంలో తన తల్లి ఒగ్గు కథలు, చిందు భాగవతాలు, నాటకాలు చూపించేందుకు తనను తీసుకెళ్లేదని, ఈ క్రమంలోనే తాను సాహిత్యంపై, పాటలపై ఆసక్తి పెంచుకున్నట్లు తెలిపారు. అలా జరిగి ఉండకపోతే తాను ఇపుడు ఈ రంగంలో ఉండేవాడిని కాదేమో అన్నారు.
ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ పట్టబద్రుడైన చంద్రబోస్... దూరదర్శన్లో సింగర్గా ప్రయత్నించాడు. అయితే అది ఫలించక పోవడంతో తన స్నేహితుడి సూచన మేరకు పాటలు రాయడం వైపు టర్న్ అయ్యారు. 1995లో తొలిసారిగా 'తాజ్ మహల్' అనే చిత్రానికి పాటలు రాశారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన