హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
- May 21, 2019
ముగ్గురు వ్యక్తుల్ని ఓ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయినవారంతా ఆసియా జాతీయులేనని అధికారులు వివరించారు. నిందితులు ముగ్గురూ కలిసి ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు. హతుడు కూడా ఆసియా జాతీయుడే. తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతోనే నిందితులు, తమ సహచరుడ్ని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్గిఏషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ డివిజన్ - ఇంటీరియర్ మినిస్ట్రీ అత్యంత వ్యూహాత్మకంగా విచారణ జరిపి నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. హత్యకు వినియోగించిన ఆయుధాల్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి తీవ్రమైన కత్తి పోట్లతో రోడ్డుపై పడి వుండగా, అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. విచారణలో అతన్ని హత్య చేసింది సహచరులేనని తేలింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..