హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
- May 21, 2019
ముగ్గురు వ్యక్తుల్ని ఓ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయినవారంతా ఆసియా జాతీయులేనని అధికారులు వివరించారు. నిందితులు ముగ్గురూ కలిసి ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశారు. హతుడు కూడా ఆసియా జాతీయుడే. తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతోనే నిందితులు, తమ సహచరుడ్ని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్గిఏషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ డివిజన్ - ఇంటీరియర్ మినిస్ట్రీ అత్యంత వ్యూహాత్మకంగా విచారణ జరిపి నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. హత్యకు వినియోగించిన ఆయుధాల్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి తీవ్రమైన కత్తి పోట్లతో రోడ్డుపై పడి వుండగా, అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. విచారణలో అతన్ని హత్య చేసింది సహచరులేనని తేలింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







