యూ.ఏ.ఈ:ఇఫ్తార్ విందుతో గిన్నీస్ రికార్డ్
- May 21, 2019
యూ.ఏ.ఈ:ముస్లిం సోదరుకలు అతి పవిత్రమైన మాసం రమదాన్. ఆకాశంలలో నెలవంక చూసినప్పటి నుంచి ప్రారంభమయ్యే రమదాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపడతారు. సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమించి ఆహారాన్ని తీసుకుంటారు. ఖీర్ (పాయసం),ఖర్చూరం వంటి బలాన్నిచ్చే ఫ్రూట్స్ తో ఉపవాసాన్ని ముగిస్తారు.
ఇలా తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని'సహర్' అనీ, సాయంత్రం ఉపవాస వ్రతదీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని' ఇఫ్తార్' అని అంటారు.
ఈ ఇఫ్తార్ విందులో దుబాయ్ లో భారత్ కు చెందిన ఓ చారిటీ సంస్థ గిన్నీస్ రికార్డ్ సృష్టించింది. అబుదాబిలోని దుబాయ్ పారిశ్రామిక పార్కులో భారతీయులు కొనసాగిస్తున్న పీసీటీ హ్యుమానిటీ చారిటీ సంస్థ ఏడు రకాల శాఖాహార వంటలతో కిలోమీటర్ పొడవునా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ఈ ఘనతను సాధించినట్టు గల్ఫ్న్యూస్ తెలిపింది. శాఖాహారం ఆరోగ్యానికి మంచిదే కాకుండా, దీన్ని తినటం వల్ల జంతువధను అరికట్టవచ్చుని తెలిపారు. ఈ రికార్డు సాధించడంలో సహకారాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు పీసీటీ హ్యుమానిటీ చారిటీ వ్యవస్థాపకుడు జోగిందర్ సింగ్ సలారియా.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







