కాప్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష
- May 21, 2019కోర్ట్ ఆఫ్ కాస్సేషన్, కాప్ని హత్య చేసిన నిందితుడికి మరణ శిక్షను సమర్థించింది. 2017 జూన్ 18వ తేదీన దిరాజ్లో ఓ పోలీస్ని నిందితుడు హత్య చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఐఈడీని ఉపయోగించి నిందితుడు, కాప్ని హత్య చేశాడు. మొత్తం నలుగురు వ్యక్తులు పోలీస్ పెట్రోల్ వాహనాన్ని టార్గెట్ చేసినట్లు అధికారులు తేల్చారు. ఈ ఘనటలో అబ్దుల్సమాద్ అబ్దుల్లా ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులకు జీవిత శిక్షతోపాటు, 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేసిన కేసులో 2,301 బహ్రెయినీ దినార్స్ చెల్లించాలనీ ఆదేశించింది న్యాయస్థానం. అలాగే బహ్రెయినీ పౌరసత్వం కూడా నిందితులకు రద్దయ్యింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్