దుబాయ్లో ముగ్గురు స్కామర్స్ అరెస్ట్
- May 21, 2019ముగ్గురు సభ్యులుగల స్కామర్స్ ముఠాని అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ముందుంచారు. అక్రమంగా వందలాది సిమ్ కార్డుల్ని జారీ చేసినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. అరెస్టయినవారిలో ఒకరు మొబైల్ ఓనర్. వినియోగదారుడి అనుమతి లేకుండా, అతని పేరు మీద సిమ్కార్డ్స్ని నిందితుడు జారీ చేసినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఈ కేసులో సాక్షి ఓ ఆఫ్రికన్ వర్కర్. సిమ్ కార్డ్ కోసం తాను ఓ షాప్కి వెళ్ళగా, అక్కడ తనకు సిమ్కార్డ్ లభ్యం కాలేదనీ, ఆ తర్వాత ఆరా తీస్తే, తన పేరు మీద తనకు తెలియకుండా సిమ్కార్డులు జారీ అయినట్లు తేలిందని బాధితుడు చెప్పారు. ఇలాంటి స్కామ్ ద్వారా పలు స్కామ్స్కి నిందితులు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. పెద్ద మొత్తంలో ఇతరుల నుండి డబ్బులు గుంజుతున్నట్లు తేల్చిన పోలీసులు, నిందితుల్ని అరెస్ట్ చేసి, న్యాయస్థానం ముందుంచడం జరిగింది.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..