దుబాయ్లో ముగ్గురు స్కామర్స్ అరెస్ట్
- May 21, 2019
ముగ్గురు సభ్యులుగల స్కామర్స్ ముఠాని అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ముందుంచారు. అక్రమంగా వందలాది సిమ్ కార్డుల్ని జారీ చేసినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. అరెస్టయినవారిలో ఒకరు మొబైల్ ఓనర్. వినియోగదారుడి అనుమతి లేకుండా, అతని పేరు మీద సిమ్కార్డ్స్ని నిందితుడు జారీ చేసినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఈ కేసులో సాక్షి ఓ ఆఫ్రికన్ వర్కర్. సిమ్ కార్డ్ కోసం తాను ఓ షాప్కి వెళ్ళగా, అక్కడ తనకు సిమ్కార్డ్ లభ్యం కాలేదనీ, ఆ తర్వాత ఆరా తీస్తే, తన పేరు మీద తనకు తెలియకుండా సిమ్కార్డులు జారీ అయినట్లు తేలిందని బాధితుడు చెప్పారు. ఇలాంటి స్కామ్ ద్వారా పలు స్కామ్స్కి నిందితులు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. పెద్ద మొత్తంలో ఇతరుల నుండి డబ్బులు గుంజుతున్నట్లు తేల్చిన పోలీసులు, నిందితుల్ని అరెస్ట్ చేసి, న్యాయస్థానం ముందుంచడం జరిగింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







