కోలకతాలో డెలివరీ బాయ్ ఔదార్యం
- May 24, 2019
కోలకతా:అన్నా ఆకలైతుంది. ఓ పది రూపాయలుంటే ఇయ్యవా.. మూడు రోజులైంది అన్నం తిని.. రొట్టె కొనుక్కుని తింటా.. అని చింపిరి జుట్టు, చిరిగిన చొక్కా వేసుకున్న మురికి వాడకు చెందిన ఓ బాలుడు కాళ్లకి అడ్డం పడేసరికి పతిక్రిత్కి జాలేసింది. కానీ ఆ వెంటనే కోపం కూడా వచ్చింది వాడితో మాట్లాడేసరికి. కారణం వాడు డ్రగ్స్కి బానిసయ్యాడని తెలుసుకున్నాడు. అందుకే మరో ఆలోచన లేకుండా వాడి చెంప పగలగొట్టాడు పతిక్రిత్. ఆ పిల్లాడు కన్నీరు మున్నీరై అతడి కథ మొత్తం చెప్పాడు. దాంతో డబ్బులిస్తే మళ్లీ డ్రగ్స్ కొంటాడని కడుపు నిండా అన్నం పెట్టించాడు.
అతడి కళ్లలో ఆనందాన్ని చూసి అప్పుడే నిర్ణయించుకున్నాడు వారి కోసం ఏమైనా చేయాలని. కోలకతాకు చెందిన పతిక్రిత్ మునిసిపల్ కార్పొరేషన్లో ఉద్యోగం చేసేవాడు. నాలుగేళ్ల కిందట కోల్కతాలోని డుమ్ డుమ్ కంటోన్మెంట్ వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఓ బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ల మీద పడ్డాడు. వాడి ఆకలి తీర్చిన ఆనందం తన ఉద్యోగ రాజీనామాకు దారి తీసింది. జొమాటోలో డెలివరీ బాయ్గా జాయినయ్యాడు. అక్కడ కస్టమర్లు క్యాన్సిల్ చేసిన ఆహారాన్ని మురికి వాడల్లో నివసిస్తున్న బాల బాలికలకు ఇస్తూ వారి కడుపు నింపుతున్నాడు. నాలుగు అక్షరం ముక్కలు నేర్పిస్తున్నాడు. నాలుగు డబ్బులు సంపాదించుకునే మార్గాన్ని చూపుతున్నాడు.
జన సంచారం ఉన్న ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్లలో, బస్టాపుల్లో వాటర్ బాటిల్ స్టాల్స్ ఏర్పాటు చేసి వారికి ఉపాధి మార్గాన్ని చూపిస్తున్నాడు. ఈ మధ్య ఓ రెస్టారెంట్ యజమాని పతిక్రిత్కి స్నేహితుడయ్యాడు. అతడితో మాటల మధ్యలో కస్టమర్లకు వడ్డించగా మిగిలిపోయిన ఆహారాన్ని పేద పిల్లలకు అందించమని పతిక్రిత్ అడిగాడు. అందుకు స్నేహితుడు కూడా ఆనందంగా ఒప్పుకున్నాడు. పేద బాలల కడుపు నింపుతున్న పతిక్రిత్ని వారంతా అన్నా, రోల్ కాకు అని ప్రేమగా పిలుచుకుంటున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







